అక్షరటుడే, ఇందూరు : Dil Raju | నర్సింగ్పల్లి (Narsingpalli) ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శ్రీ గోదా రంగనాథ కల్యాణం కనుల పండువగా జరిగింది. అమ్మవారి కల్యాణ వేడుకల్లో దిల్ రాజు దంపతులు పాల్గొన్నారు.
Dil Raju | ‘శ్రీ వ్రతం’ చేసి రంగనాథుడిలో విలీనమై..
నేడు గోదా కల్యాణంతో (Godha Kalyanam) పరమ పవిత్రమైన ధనుర్మాసం ముగుస్తుందని ఆచార్యులు సంపత్ కుమారాచార్య తెలిపారు. గోదాదేవి ఎంతో నిష్టతో ‘శ్రీ వ్రతం’ చేసి రంగనాథుడిని కల్యాణమాడి వారిలో లీనమైందని అన్నారు. ధనుర్మాసంలో ‘తిరుప్పావై’ (Thiruppavai) పఠనం మనకు వైకుంఠనాథుడిని హృదయానికి చేరువ చేస్తుందన్నారు. గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్దఎత్తున పాల్గొనడంతో ఆలయం కిటకిటలాడింది. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరోహిత్ కుమారాచార్య, విజయ్ స్వామి, ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు దంపతులు, నర్సింహారెడ్డి దంపతులు, నర్సారెడ్డి, రమేష్, నరాల సుధాకర్ దంపతులు, ప్రసాద్ భాస్కర్, మురళి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.