Geeta Jayanti | ఘనంగా గీతా జయంతి ఉత్సవాలు

అక్షరటుడే, భీమ్​గల్: Geeta Jayanti | పట్టణంలోని సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో (Saraswati Vidya Mandir High School) గీతా జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని, భగవద్గీతను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గీతా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి విద్యార్థి తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి, సరైన మార్గంలో పయనించడానికి […]

అక్షరటుడే, భీమ్​గల్: Geeta Jayanti | పట్టణంలోని సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో (Saraswati Vidya Mandir High School) గీతా జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని, భగవద్గీతను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం గీతా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి విద్యార్థి తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి, సరైన మార్గంలో పయనించడానికి భగవద్గీతలోని (Bhagavad Gita) సందేశాలు ఎలా ఉపయోగపడతాయో వివరించారు. విద్యార్థులు భగవద్గీతలోని శ్లోకాలతో కూడిన నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. విద్యార్థులు గీతలోని ముఖ్య ఘట్టాలను ప్రదర్శిస్తూ నిర్వహించిన నాటిక ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంది.

గీత కేవలం ఒక మత గ్రంథం కాదని, అది జీవిత సారాంశాన్ని, కర్మ సిద్ధాంతాన్ని బోధించే గొప్ప పుస్తకమని కొనియాడారు. విద్యార్థులు చిన్నతనం నుంచే గీతా పఠనం, అందులోని నీతిని అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు భగవద్గీత గ్రంథాలను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్​ఎం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...