SP Rajesh Chandra | జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్​: ఎస్పీ రాజేష్​ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | అక్రమంగా తరలిస్తున్న జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రామారెడ్డి మండల కేంద్రంలో (Ramareddy Mandal) ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఓ బైక్​పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దాంతో వారిని వెంబడించి పట్టుకుని విచారించగా […]

అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | అక్రమంగా తరలిస్తున్న జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

రామారెడ్డి మండల కేంద్రంలో (Ramareddy Mandal) ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఓ బైక్​పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దాంతో వారిని వెంబడించి పట్టుకుని విచారించగా ఎటువంటి అనుమతి లేని జిలెటిన్​ స్టిక్స్, డిటోనేటర్లు, వైర్లను తరలిస్తున్నట్టుగా గుర్తించారు.

SP Rajesh Chandra | నిజామాబాద్​ జిల్లా నందిపేట్​..

నిజామాబాద్ జిల్లా (Nizamabad District) నందిపేటకు చెందిన వరికుప్పల నర్సింలు అనే వ్యక్తి నుంచి డిటోనేటర్లు కొనుగోలు చేసి గాంధారి మండలంలోని నివాస ప్రాంతాల మధ్య ఉన్న బండరాళ్లను పేల్చేందుకు తీసుకెళ్తున్నట్లుగా విచారణలో తేలింది. దీంతో పేలుడు పదార్థాలు తరలిస్తున్న కామారెడ్డి మండలం (Kamareddy Mandal) గర్గుల్ గ్రామానికి చెందిన రాజు, ఛత్తీస్​ఘడ్ రాష్ట్రం మౌలమవ్ పూర్​కు చెందిన చౌకి, పనర్వాణి గ్రామానికి చెందిన శేషులాల్​లను అరెస్ట్ చేశారు. పేలుడు పదార్థాలు విక్రయించిన వ్యక్తి వద్ద 5 వేలకు పైగా ఉన్న జిలిటీన్ స్టిక్స్ ఉన్న మ్యాగ్జిన్ లభించిందని, వాటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తుల వద్ద 50 జిలెటిన్​ స్టిక్స్, 6 డిటోనేటర్లు, 52 మీటర్ల వైరు, ఒక బైక్, మొబైల్, స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే విక్రయించిన వ్యక్తి నర్సింలు వద్ద 20 జిలెటిన్​ స్టిక్స్, 4 డిటోనేటర్లు, 5 మీటర్ల వైర్​, లాగ్ బుక్స్, మొబైల్ స్వాధీనం చేసుకున్నామన్నారు.

విచారణలో పేలుడు పదార్థాల లైసెన్స్ ఉన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం (Armoor Mandal) ఒరుసు సాయి మల్లు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను వినియోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. తప్పించుకుని పారిపోతున్న వ్యక్తులను పట్టుకున్న హోంగార్డును ఎస్పీ అభినందించారు. సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), కామారెడ్డి రూరల్ సీఐ రామన్ (Kamareddy Rural CI Raman), మాచారెడ్డి ఎస్సై అనిల్ (Machareddy SI Anil) పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...