MLA Pocharam | ఉచిత చేప విత్తనాలు మత్స్యకారులకు వరం: పోచారం

అక్షరటుడే, వర్ని: MLA Pocharam | దేశంలో ఎక్కడా లేనివిధంగా మన తెలంగాణలోనే (Telangana) వందశాతం సబ్సిడీతో చేప విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోందని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వర్ని మండలం (Varni Mandal) జలాల్‌పూర్ గ్రామంలోని పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను శుక్రవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్ కాసుల బాలరాజ్​తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ప్రపంచ మత్స్యకార దినోత్సవం (World Fisheries […]

అక్షరటుడే, వర్ని: MLA Pocharam | దేశంలో ఎక్కడా లేనివిధంగా మన తెలంగాణలోనే (Telangana) వందశాతం సబ్సిడీతో చేప విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోందని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వర్ని మండలం (Varni Mandal) జలాల్‌పూర్ గ్రామంలోని పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను శుక్రవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్ కాసుల బాలరాజ్​తో కలిసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ప్రపంచ మత్స్యకార దినోత్సవం (World Fisheries Day) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల మత్స్యకారులు స్వయంగా చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో, దళారులు పెట్టుబడులు పెట్టి చెరువులపై పట్టు సాధించేవారన్నారు.

ఫలితంగా మత్స్యకారుల శ్రమ దోపిడీకి గురయ్యేవారని లాభాలు దళారులకే చేరేవని ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి మత్స్యకారులు దళారులకు చేపలను అమ్మకుండా, స్వయంగా గ్రామాలు, పట్టణాల్లో తిరిగి విక్రయించి లాభాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో బోధన్ సబ్‌కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato), జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయ స్వామి, ఫిషరీస్ మాజీ అదనపు డైరెక్టర్ శంకర్ నాయక్ రాథోడ్, వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...