Nizamabad CP | సైబర్ నేరాల నివారణ కోసం ‘ఫ్రాడ్ కా ఫుల్​స్టాప్’ కార్యక్రమం ప్రారంభం

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | జిల్లావ్యాప్తంగా సైబర్​ నేరాల నివారణ కోసం ‘ఫ్రాడ్ కా ఫుల్​స్టాప్’ (Fraud ka full stop) కార్యక్రమం ప్రారంభించినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని వరుసగా ఆరు వారాల పాటు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులకు సైబర్​ నేరాలపై అవగాహన కల్పించడం, ఆన్​లైన్​ గేమ్స్​ ఆడితే కలిగే నష్టాలు, అపరిచిత వ్యక్తులు […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | జిల్లావ్యాప్తంగా సైబర్​ నేరాల నివారణ కోసం ‘ఫ్రాడ్ కా ఫుల్​స్టాప్’ (Fraud ka full stop) కార్యక్రమం ప్రారంభించినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమాన్ని వరుసగా ఆరు వారాల పాటు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులకు సైబర్​ నేరాలపై అవగాహన కల్పించడం, ఆన్​లైన్​ గేమ్స్​ ఆడితే కలిగే నష్టాలు, అపరిచిత వ్యక్తులు ఓటీపీ అడిగితే వ్యవహరించే తీరు, డిజిటల్​ అరెస్ట్​ తదితర విషయాలపై విద్యార్థులు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఒకవేళ సైబర్ మోసానికి (cyber fraud) గురైతే, వెంటనే 1930 నంబర్‌కు కాల్​చేసి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమాలు ప్రజలు, యువత, విద్యార్థుల్లో మార్పు తెచ్చేవిధంగా నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్​ అలీ, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ (CCPS) ఇన్‌స్పెక్టర్ ముఖిద్ పాషా, సీటీసీ ఇన్​స్పెక్టర్​ శివరాం, ఎస్​ఐపీ ప్రవళిక, ఐటీ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...