Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | సైబర్ నేరాల నివారణ కోసం ‘ఫ్రాడ్ కా ఫుల్​స్టాప్’ కార్యక్రమం ప్రారంభం

Nizamabad CP | సైబర్ నేరాల నివారణ కోసం ‘ఫ్రాడ్ కా ఫుల్​స్టాప్’ కార్యక్రమం ప్రారంభం

జిల్లావ్యాప్తంగా సైబర్​ నేరాల నివారణ కోసం ‘ఫ్రాడ్ కా ఫుల్​స్టాప్’ కార్యక్రమం ప్రారంభించినట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | జిల్లావ్యాప్తంగా సైబర్​ నేరాల నివారణ కోసం ‘ఫ్రాడ్ కా ఫుల్​స్టాప్’ (Fraud ka full stop) కార్యక్రమం ప్రారంభించినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమాన్ని వరుసగా ఆరు వారాల పాటు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులకు సైబర్​ నేరాలపై అవగాహన కల్పించడం, ఆన్​లైన్​ గేమ్స్​ ఆడితే కలిగే నష్టాలు, అపరిచిత వ్యక్తులు ఓటీపీ అడిగితే వ్యవహరించే తీరు, డిజిటల్​ అరెస్ట్​ తదితర విషయాలపై విద్యార్థులు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఒకవేళ సైబర్ మోసానికి (cyber fraud) గురైతే, వెంటనే 1930 నంబర్‌కు కాల్​చేసి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమాలు ప్రజలు, యువత, విద్యార్థుల్లో మార్పు తెచ్చేవిధంగా నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్​ అలీ, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ (CCPS) ఇన్‌స్పెక్టర్ ముఖిద్ పాషా, సీటీసీ ఇన్​స్పెక్టర్​ శివరాం, ఎస్​ఐపీ ప్రవళిక, ఐటీ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News