Former MLA Jeevan Reddy | వినయ్​ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి ఫైర్​..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Former MLA Jeevan Reddy | కాంగ్రెస్​ నేత, ఆర్మూర్​ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్​ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు జీవన్​రెడ్డి ఫైర్​ అయ్యారు. ఆర్మూర్​ పట్టణంలో డివైడర్​ పెంచుతున్న మొక్కలు, చెట్లను నరకడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR కోట్లు పెట్టి నిర్మించిన డివైడర్‌పై, పదేళ్లుగా తాము పెంచిన 400 చెట్లను అక్రమంగా నరికేశారని దుయ్యబట్టారు. ఇదెక్కడి అరాచకం అని ప్రశ్నించారు. Former MLA Jeevan Reddy | […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Former MLA Jeevan Reddy | కాంగ్రెస్​ నేత, ఆర్మూర్​ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్​ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు జీవన్​రెడ్డి ఫైర్​ అయ్యారు. ఆర్మూర్​ పట్టణంలో డివైడర్​ పెంచుతున్న మొక్కలు, చెట్లను నరకడాన్ని తప్పుబట్టారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR కోట్లు పెట్టి నిర్మించిన డివైడర్‌పై, పదేళ్లుగా తాము పెంచిన 400 చెట్లను అక్రమంగా నరికేశారని దుయ్యబట్టారు. ఇదెక్కడి అరాచకం అని ప్రశ్నించారు.

Former MLA Jeevan Reddy | ఏం అధికారం ఉందని..

కేవలం పైసా వసూల్ రెడ్డి ఫొటోలు ఉన్న 300 బోర్డులు పెట్టుకోవడానికి పర్యావరణాన్ని నాశనం చేస్తారా.. ఇదేనా ఆర్మూర్ ప్రజలకు ఇచ్చే సందేశం..? అని నిలదీశారు.

ఏ అధికారం ఉందని ఈ పని చేశారు..? మున్సిపల్ కమిషనర్‌వా? సర్పంచ్‌వా? కౌన్సిలర్‌వా? చెట్లను నరకడానికి నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.

నరికించిన చేతులతోనే చెట్లను తిరిగి నాటాలని డిమాండ్​ చేశారు. లేదంటే, ఆర్మూర్ ప్రజలందరినీ ఏకం చేసి, ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం ఎలాగో చూపిస్తామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సదరు మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి ఇన్​స్టాలో పోస్టు చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...