Food Poisoning | ఎస్సీ హాస్టల్​లో ఫుడ్​ పాయిజన్​.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Food Poisoning | గద్వాల జిల్లా (Gadwal District) కేంద్రంలోని ఎస్సీ హాస్టల్​లో ఫుడ్​ పాయిజన్​ అయింది. కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు. హాస్టల్​లో విద్యార్థులు (Hostel Students) మంగళవారం ఉదయం టిఫిన్​ చేశారు. అనంతరం పాఠశాలకు వెళ్లారు. తర్వాత కొద్దిసేపటికే 15 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఓ విద్యార్థి పరిస్థితి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Food Poisoning | గద్వాల జిల్లా (Gadwal District) కేంద్రంలోని ఎస్సీ హాస్టల్​లో ఫుడ్​ పాయిజన్​ అయింది. కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు.

హాస్టల్​లో విద్యార్థులు (Hostel Students) మంగళవారం ఉదయం టిఫిన్​ చేశారు. అనంతరం పాఠశాలకు వెళ్లారు. తర్వాత కొద్దిసేపటికే 15 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ.. ఉదయం పెట్టిన ఉప్మాలో పురుగులు వచ్చాయన్నారు. వార్డెన్​కు చెప్పడంతో పారవేశారన్నారు. అనంతరం అరటిపళ్లు, బిస్కెట్లు తిని స్కూల్‌కి వెళ్లామన్నారు. ఈ క్రమంతో కడుపునొప్పి, వాంతులైనట్లు చెబుతున్నారు.

Food Poisoning | కవిత ఆగ్రహం

ఫుడ్​ పాయిజన్​ ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు ఆవేదనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) చేతగానితనానికి నిదర్శమన్నారు. పేదింటి బిడ్డలంటే కాంగ్రెస్​కు లెక్క లేదని విమర్శించారు. విద్యా శాఖ స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నా వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...