అక్షరటుడే, వెబ్డెస్క్ : Sriram Sagar | రెండు రోజులుగా శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ (SRSP)కు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు వరద గేట్లను మూసివేశారు. అయితే ఆదివారం రాత్రి మళ్లీ ఇన్ఫ్లో పెరగడంతో గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటి విడుదలను ప్రారంభించారు.
ప్రస్తుతం జలాశయంలోకి 34,782 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. అధికారులు 8 వరద గేట్లను ఎత్తి 24,992 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా మూడు వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 5 వేలు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది. ఎగువ నుంచి వరద పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తుతామని అధికారులు తెలిపారు. దిగువన గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.