అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy Floods | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ (Sriram Sagar) ప్రాజెక్ట్కు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
జలాశయంలోకి ప్రస్తుతం 2,70,219 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 39 వరద గేట్లను ఎత్తి దిగువకు 2,10,925 క్యూసెక్కులు వదులుతున్నారు. వరద కాలువకు రెండు వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 5,500, ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500, సరస్వతి కాలువకు 400, అలీసాగర్ ఎత్తిపోతలకు 360 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు 231, ఆవిరి రూపంలో 600 క్యూసెక్కులు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 64.03 టీఎంసీల నీరు ఉంది.
Heavy Floods | నిజాంసాగర్కు..
నిజాంసాగర్ ప్రాజెక్ట్ (Nizamsagar Project)కు ఎగువన సింగూరు (Singuru), పోచారం ప్రాజెక్ట్ల నుంచి భారీగా వరద వస్తోంది. సింగూరు జలాశయానికి 89,305 క్యూసెక్కుల వరద వస్తుండగా.. వరద గేట్ల ద్వారా 87,221 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 1,284 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దీంతో నిజాంసాగర్కు సైతం వరద క్రమంగా పెరుగుతోంది.
ప్రసత్తం నిజాంసాగర్లోకి 74,340 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. వరద గేట్ల ద్వారా 87,709 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు 1,250 క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 13.2 టీఎంసీల నీరు ఉంది.