అక్షరటుడే, మెండోరా: Sriramsagar | ఎస్సారెస్పీలోకి ఎగువ నుండి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఉదయం 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు వరద తగ్గడంతో 11 గంటల ప్రాంతంలో 8 గేట్లు మాత్రమే ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
Sriramsagar | ప్రస్తుతం ప్రాజెక్టులో..
ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1091 అడుగులకు (80.051 టీఎంసీలు) చేరింది. జలాశయంలో నిల్వలు పూర్తిస్థాయికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఇన్ఫ్లో 34,790 క్యూసెక్కులు వస్తున్న నేపథ్యంలో.. అంతేమొత్తంలో 34,790 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
Sriramsagar | కాల్వల ద్వారా నీటి విడుదల
ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా చేరుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు నుండి వివిధ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ (kakatiya kaluva) ద్వారా 5,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ (laxmi Kaluva) ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. అలాగే 709 క్యూసెక్కుల నీరు ఆవిరిగా పోతోంది.
Sriramsagar | అప్రమత్తంగా ఉండాలని సూచన..
ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో గోదావరి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువులు, గొర్రెల కాపర్లు, జాలర్లు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎఫ్ఎఫ్సీ, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల ప్రాజెక్టులకు నీటి విడుదల తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
Sriramsagar | నిజాంసాగర్లో..
Nizam Sagar | నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి (Nizamsagar Project) ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 34,604 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
నిజాంసాగర్కు వరద వస్తుండడంతో వరద గేట్ల ద్వారా 13,562 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా.. అంతే మొత్తంలో 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కాగా ఎగువన సింగూరు నుంచి ప్రవాహం తగ్గింది. దీంతో దిగువకు నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఫలితంగా నిజాంసాగర్కు ఇన్ఫ్లో (Inflow) క్రమంగా తగ్గే అవకాశం ఉంది.
Nizam Sagar | పోచారం ప్రాజెక్ట్లోకి..
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్కు (Pocharam project) స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాంలోకి 832 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రాజెక్ట్లోకి 27.948 టీఎంసీల నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు.