Manyam District | చ‌లి కోసం వేసిన నిప్పుల కుంప‌టి ఎంత ప‌ని చేసింది.. ఊపిరాడ‌క ముగ్గురు మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Manyam District | పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చలివాతావరణంలో వెచ్చదనం కోసం ఇంట్లో వేసుకున్న నిప్పుల కుంపటి ఒకే కుటుంబాన్ని మృత్యువులోకి నెట్టింది. తొలుత ఈ ఘటనను కుటుంబ ఆత్మహత్యగా భావించినప్పటికీ, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇది ప్రమాదవశాత్తూ జరిగిన విషాద ఘటనగా తేలింది. కార్బన్ మోనాక్సైడ్ (Carbon Monoxide) వాయువు ప్రభావంతో ఊపిరాడక ముగ్గురు మృతి చెందగా, మరో చిన్నారి ప్రస్తుతం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Manyam District | పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చలివాతావరణంలో వెచ్చదనం కోసం ఇంట్లో వేసుకున్న నిప్పుల కుంపటి ఒకే కుటుంబాన్ని మృత్యువులోకి నెట్టింది.

తొలుత ఈ ఘటనను కుటుంబ ఆత్మహత్యగా భావించినప్పటికీ, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇది ప్రమాదవశాత్తూ జరిగిన విషాద ఘటనగా తేలింది. కార్బన్ మోనాక్సైడ్ (Carbon Monoxide) వాయువు ప్రభావంతో ఊపిరాడక ముగ్గురు మృతి చెందగా, మరో చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. డీఎస్పీ రాంబాబు (DSP Rambabu), సీఐ తిరుపతిరావు (CI Tirupati Rao) వివరాల ప్రకారం వనజ గ్రామానికి చెందిన మీనక మధు (35), సత్యవతి (30) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Manyam District | తీవ్ర విషాదం..

పెద్ద కుమార్తె మాధురి చినమేరంగి కేజీబీవీలో చదువుతుండగా, రెండో కుమార్తె మోక్ష తాతగారి ఊరు బొమ్మికలో ఉండి చదువుకుంటోంది. చిన్న పిల్లలు అయేషా (6), మోస్య (4) తల్లిదండ్రుల వద్దే నివసిస్తున్నారు. గురువారం రాత్రి మధు, సత్యవతి, అయేషా, మోస్య ఇంట్లోనే నిద్రపోయారు. శుక్రవారం ఉదయం ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో అనుమానించిన పొరుగువారు, బంధువులు తలుపులు తెరిచి చూడగా, ఇంట్లో నలుగురు అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. చినమేరంగి సామాజిక ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు మధు, సత్యవతి, మోస్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తీవ్ర అస్వస్థతకు గురైన అయేషాను పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి (Parvathipuram District Hospital), అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించారు.

ఈ ఘటనకు అప్పుల భారం కారణమై కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని తొలుత గ్రామంలో ప్రచారం జరిగింది. అయితే పోలీసుల విచారణలో వాస్తవం వేరని తేలింది. చలి నుంచి రక్షణ కోసం ఇంట్లో నిప్పుల కుంపటి పెట్టుకుని తలుపులు మూసివేయడంతో కార్బన్ మోనాక్సైడ్ వాయువు అధికంగా విడుదలై ఊపిరాడక ఈ విషాదం చోటుచుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...