Homeతాజావార్తలుCM Revanth Reddy | దేశవ్యాప్తంగా రేషన్​ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలి :...

CM Revanth Reddy | దేశవ్యాప్తంగా రేషన్​ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలి : సీఎం రేవంత్​రెడ్డి

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో గురువారం ఆయన సమావేశం అయ్యారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల (Ration Shops) ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం హైదరాబాద్​కు వచ్చారు.

ముఖ్యమంత్రి కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి (Uttam Kumar Reddy)తో కలిసి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలకు సన్నబియ్యం పంపిణీ అంశంపై వివరించారు. ప్రజలు తినే బియ్యం సరఫరా చేసినప్పుడే ఆ సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని తెలిపారు. తెలంగాణ (Telangana)లో అమలు చేస్తున్నట్టుగా దేశ వ్యాప్తంగా వినియోగదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని సూచించారు. ఈ విషయంలో సమగ్రంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. పూర్తిస్థాయి అధ్యయనం జరిపిన తరువాత దేశ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.