Collector Nizamabad | రైతు బజార్లను వినియోగించుకోవాలి

అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | రైతు బజార్లను వర్తకులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లోని రైతు బజార్లను శుక్రవారం ఆయన సందర్శించారు. రైతు బజార్లను (Raithu bazar) కూరగాయల వర్తకులు వినియోగించడం లేదని గమనించిన కలెక్టర్ అందుకు గల కారణాలను ఆరా తీశారు. వినియోగదారులు లోపలికి రావడం లేదని, రోడ్లకు ఆనుకొని ఇరువైపులా ఉన్న దుకాణాల నుంచే కొనుగోలు చేస్తున్నారని, దీంతో […]

అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | రైతు బజార్లను వర్తకులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లోని రైతు బజార్లను శుక్రవారం ఆయన సందర్శించారు.

రైతు బజార్లను (Raithu bazar) కూరగాయల వర్తకులు వినియోగించడం లేదని గమనించిన కలెక్టర్ అందుకు గల కారణాలను ఆరా తీశారు. వినియోగదారులు లోపలికి రావడం లేదని, రోడ్లకు ఆనుకొని ఇరువైపులా ఉన్న దుకాణాల నుంచే కొనుగోలు చేస్తున్నారని, దీంతో రోడ్ల పక్కన విక్రయించాల్సి వస్తోందని వర్తకులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే రోడ్ల పక్కన విక్రయాలు జరపడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. కచ్చితంగా రైతు బజార్లలోనే అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Collector Nizamabad | నాణ్యతతో నిర్ణీత ధరలకే విక్రయించాలి

నిర్ణీత ధరలకు విక్రయిస్తూ నాణ్యత, శుభ్రత పాటిస్తే వినియోగదారులు వస్తారని కలెక్టర్ వర్తకులకు సూచించారు. పాత గంజ్​ ప్రాంతంలో ఆక్రమణలను గుర్తించి, వాటిని తొలగించేందుకు డీ మార్కింగ్ చేయాలని ఆదేశించారు. అన్ని రైతుబజార్లు ఉపయోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Collector Nizamabad | ట్యాంక్ నిర్మాణ పనుల పరిశీలన

అమృత్ పథకం (Amrit Scheme) కింద తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు నగరంలోని నాందేవ్​వాడ, గౌతమ్ నగర్​లో కొనసాగుతున్న మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులు మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్​ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. అంతకుముందు నాగారం 300 క్వార్టర్స్​లోని బస్తీ దవాఖానాను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఇతర అధికారులు ఉన్నారు.

అమృత్​ స్కీంలో భాగంగా వాటర్​ట్యాంక్​ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...