Kadapa | రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kadapa | ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లాలో (Kadapa district) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని శంకరాపురానికి చెందిన శ్రీరాములు (35), శిరీష (30) దంపతులు. వారికి ఏడాదిన్నర కుమారుడు రిత్విక్​ ఉన్నారు. అయితే ఏం కష్టం వచ్చిందో ఏమో గాని ఆదివారం రాత్రి ఆ దంపతులు తమ కుమారుడితో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kadapa | ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లాలో (Kadapa district) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

జిల్లా కేంద్రంలోని శంకరాపురానికి చెందిన శ్రీరాములు (35), శిరీష (30) దంపతులు. వారికి ఏడాదిన్నర కుమారుడు రిత్విక్​ ఉన్నారు. అయితే ఏం కష్టం వచ్చిందో ఏమో గాని ఆదివారం రాత్రి ఆ దంపతులు తమ కుమారుడితో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. కడప- కృష్ణాపురం రైల్వే స్టేషన్ల మధ్య వేగంగా వస్తున్న గూడ్స్‌ ట్రైన్​కు (goods train) వారు ఎదరుగా వెళ్లారు. రైలు ఢీకొట్టడంతో వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు.

Kadapa | గుండెపోటుతో నానమ్మ మృతి

కుటుంబ కలహాలతోనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. శ్రీరాములు, శిరీష గొడవ పడటంతో ఆయన నానమ్మ ఆదివారం రాత్రి వారిని మందలించినట్లు తెలిసింది. దీంతో కుటుంబంతో సహా శ్రీరాములు ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా వారు బయటకు వెళ్లిన కాసేపటికే శ్రీరాములు నానమ్మ సైతం గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేరోజు చనిపోవడంపై స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు (investigating). వారి ఆత్మహత్యకు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో సైతం విచారణ చేపడుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...