Nizamabad | సౌమ్యకు న్యాయం చేయాలని ఎక్సైజ్ ఉద్యోగుల ఆందోళన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | ఎక్సైజ్​ కానిస్టేబుల్ (Excise Constable) సౌమ్యకు న్యాయం చేయాలని ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. శనివారం జిల్లా ఎక్సైజ్​ కార్యాలయం (District Excise Office) ఎదుట విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తులు కానిస్టేబుల్​ సౌమ్యను (Constable Soumya) శుక్రవారం రాత్రి కారుతో ఢీకొన్న విషయం తెలిసిందే. గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టగా.. నిందితులు కారు ఆపకుండా సౌమ్యను ఢీకొట్టారు. దీంతో ఆమెకు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | ఎక్సైజ్​ కానిస్టేబుల్ (Excise Constable) సౌమ్యకు న్యాయం చేయాలని ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. శనివారం జిల్లా ఎక్సైజ్​ కార్యాలయం (District Excise Office) ఎదుట విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.

గంజాయి తరలిస్తున్న వ్యక్తులు కానిస్టేబుల్​ సౌమ్యను (Constable Soumya) శుక్రవారం రాత్రి కారుతో ఢీకొన్న విషయం తెలిసిందే. గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టగా.. నిందితులు కారు ఆపకుండా సౌమ్యను ఢీకొట్టారు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఎక్సైజ్​ పోలీసులు (Excise Police) ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌమ్యకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Nizamabad | సూపరింటెండెంట్​ను నిలదీసిన ఉద్యోగులు

ఎక్సైజ్ ఉద్యోగులు సూపరింటెండెంట్ మల్లారెడ్డిని (Superintendent Mallareddy) నిలదీశారు. గంజాయి కేసులో విషయంలో ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిని వేధిస్తున్నారని ఆరోపించారు. వారి పదోన్నతుల కోసం సిబ్బందిని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు వారికి సర్ది చెప్పారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...