అక్షరటుడే, బోధన్: Exam Center Security | ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. బోధన్ పట్టణంలోని జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు.
Exam Center Security | పట్టణంలోని తొమ్మిది కేంద్రాల్లో..
పట్టణంలోని తొమ్మిది కేంద్రాల్లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభం కాగా.. కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆమె అధికారులతో మాట్లాడారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా పోలీసులు పర్యవేక్షణ చేయాలన్నారు.
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..
పరీక్షలు జరుగుతున్న సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. పట్టణంలోని తొమ్మిది సెంటర్లలో 3,007 విద్యార్థులకు గాను గురువారం 2,920మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato), అధికారులు ఉన్నారు.
