Vigilance Week | అవినీతికి వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ నిలబడాలి: సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Vigilance Week | ప్రజలంతా అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పిలుపునిచ్చారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా పాత కలెక్టరేట్ గ్రౌండ్​ (Old Collectorate Ground) నుంచి ర్యాలీని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ప్రారంభించారు. పాత కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాయిరెడ్డి పెట్రోల్ […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Vigilance Week | ప్రజలంతా అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పిలుపునిచ్చారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

ముందుగా పాత కలెక్టరేట్ గ్రౌండ్​ (Old Collectorate Ground) నుంచి ర్యాలీని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ప్రారంభించారు. పాత కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాయిరెడ్డి పెట్రోల్ పంప్ (Sai Reddy Petrol Pump) వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అవినీతి వల్ల వచ్చే ఇబ్బందులను ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.

అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గురువారం రాష్ట్ర రాజధానిలో ఒక క్యూఆర్ కోడ్​ను విడుదల చేశారన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లయితే క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు తెలియపర్చవచ్చన్నారు. అవినీతికి వ్యతిరేకంగా నిలబడి పేద మధ్యతరగతి ప్రజలకు అన్ని సర్వీసులు అందే విధంగా న్యాయం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి (Additional DCP Baswa Reddy), వన్ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి (One Town SHO Raghupathi) తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...