Homeజిల్లాలునిజామాబాద్​Vigilance Week | అవినీతికి వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ నిలబడాలి: సీపీ సాయి చైతన్య

Vigilance Week | అవినీతికి వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ నిలబడాలి: సీపీ సాయి చైతన్య

ప్రజలంతా అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Vigilance Week | ప్రజలంతా అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పిలుపునిచ్చారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

ముందుగా పాత కలెక్టరేట్ గ్రౌండ్​ (Old Collectorate Ground) నుంచి ర్యాలీని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ప్రారంభించారు. పాత కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాయిరెడ్డి పెట్రోల్ పంప్ (Sai Reddy Petrol Pump) వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అవినీతి వల్ల వచ్చే ఇబ్బందులను ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.

అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గురువారం రాష్ట్ర రాజధానిలో ఒక క్యూఆర్ కోడ్​ను విడుదల చేశారన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లయితే క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు తెలియపర్చవచ్చన్నారు. అవినీతికి వ్యతిరేకంగా నిలబడి పేద మధ్యతరగతి ప్రజలకు అన్ని సర్వీసులు అందే విధంగా న్యాయం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి (Additional DCP Baswa Reddy), వన్ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి (One Town SHO Raghupathi) తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News