Homeజిల్లాలునిజామాబాద్​Blood Donation Camp | ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలి: బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​

Blood Donation Camp | ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలి: బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​

పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బోధన్​ పట్టణంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​ స్వయంగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్​ : Blood Donation Camp | రక్తదానం ప్రాణదానమని.. ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​ (Bodhan ACP Srinivas) సూచించారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బోధన్​ పట్టణంలోని పోలీస్​స్టేషన్ల ఆధ్వర్యంలో మంగళవారం రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేశారు. టౌన్​ పోలీస్​స్టేషన్​లో ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరం (Blood Donation Camp)లో ఆయన రక్తదానం చేసిన అనంతరం మాట్లాడారు.

Blood Donation Camp | మరొకరికి ప్రాణదానం..

ఆపదలో ఉన్న సమయంలో రక్తదానం (Blood Donate) చేయడం ద్వారా ఓ విలువైన ప్రాణాన్ని కాపాడిన వారమవుతామని ఏసీపీ పేర్కొన్నారు. రక్తదానం చేస్తున్నవారిని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో పోలీసులతో పాటు ప్రజలు సుమారు 100 మందికి పైగా రక్తదానం చేశారు. బోధన్​ రూరల్​ సీఐ విజయ్​బాబు (Bodhan Rural CI Vijay Babu), ఎస్సై మశ్చేందర్​రెడ్డి, ఎడపల్లి, కోటగిరి, వర్ని ఎస్సైలు, రెడ్​క్రాస్​సొసైటీ ప్రతినిధి తోట రాజశేఖర్​​ తర సిబ్బంది పాల్గొన్నారు.