Cyber ​​crime | సైబర్​ నేరాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి

అక్షరటుడే, బాల్కొండ: Cyber ​​crime | సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని బాల్కొండ ఎస్సై శైలేందర్ (Balkonda SI Shailender) పేర్కొన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు బాల్కొండ పోలీసులు మంగళవారం ఆయా గ్రామాల్లో విస్తృతస్థాయి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే బాల్కొండ పోలీస్ స్టేషన్ (Balkonda police station) పరిధిలోని ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతం, వ్యాపార కేంద్రాల్లో ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ ఈ ప్రచారాన్ని నిర్వహించారు. Cyber ​​crime | ఓటీపీలు చెప్పవద్దు.. […]

అక్షరటుడే, బాల్కొండ: Cyber ​​crime | సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని బాల్కొండ ఎస్సై శైలేందర్ (Balkonda SI Shailender) పేర్కొన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు బాల్కొండ పోలీసులు మంగళవారం ఆయా గ్రామాల్లో విస్తృతస్థాయి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే బాల్కొండ పోలీస్ స్టేషన్ (Balkonda police station) పరిధిలోని ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతం, వ్యాపార కేంద్రాల్లో ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ ఈ ప్రచారాన్ని నిర్వహించారు.

Cyber ​​crime | ఓటీపీలు చెప్పవద్దు..

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలు అవసరమైన ఫోన్ కాల్స్​కు స్పందించవద్దన్నారు. అలాగే ఓటీపీలు ఎవరికి చెప్పవద్దన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల (local body elections) నేపథ్యంలో కొంతమంది సోషల్ ఇంజినీరింగ్, మోసపూరిత ఫోన్​కాల్స్, డిజిటల్ అరెస్ట్ వంటి కొత్త తరహా సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ‘‘మీ కుటుంబ సభ్యులు డిజిటల్ అరెస్ట్ అయ్యారు.. వారిని విడిపించాలంటే వెంటనే డబ్బులు పంపాలి” వంటి డిమాండ్లు ఫోన్లలో వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదన్నారు. అలాంటి మోసాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Cyber ​​crime | మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలి

అనుమానాస్పద ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ మోసాలు ఎదురయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై సూచించారు. అలాగే నేషనల్ సైబర్ సెక్యూరిటీ టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలను కోరారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు వాసుదేవ్, భాస్కర్, రమేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...