Maoists | కోవర్ట్​ ఆపరేషన్‌తో మావోయిస్ట్ అగ్రనేతల ఎన్‌కౌంటర్లు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బల వెనుక కోవర్ట్​ ఆపరేషన్​ (covert operation) ఉన్నట్లు సమాచారం. దీంతోనే ఇటీవల కీలక నేతలు హతం అవుతున్నట్లు పార్టీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం (central government) 2026 మార్చి వరకు దేశంలో నక్సల్స్​ లేకుండా చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) చేపట్టి వేల సంఖ్యలో బలగాలతో అడవులను జల్లెడ పడుతోంది. ఈ క్రమంలో వందలాది ఎన్​కౌంటర్లు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బల వెనుక కోవర్ట్​ ఆపరేషన్​ (covert operation) ఉన్నట్లు సమాచారం. దీంతోనే ఇటీవల కీలక నేతలు హతం అవుతున్నట్లు పార్టీ పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం (central government) 2026 మార్చి వరకు దేశంలో నక్సల్స్​ లేకుండా చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) చేపట్టి వేల సంఖ్యలో బలగాలతో అడవులను జల్లెడ పడుతోంది. ఈ క్రమంలో వందలాది ఎన్​కౌంటర్లు చోటు చేసుకొని అనేక మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే గతంలో దళ సభ్యులు మాత్రమే ఎన్​కౌంటర్లలో చనిపోయేవారు. ఇటీవల కీలక నేతలే లక్ష్యంగా బలగాలు కూంబింగ్​ చేపడుతున్నాయి. ఈ క్రమంలో పలువురు అగ్రనేతలను బలగాలు మట్టుబెట్టాయి.

Maoists | అప్పటి నుంచి..

మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీ నంబాల కేశవరావు (Nambala Kesava Rao) మే 21న ఎన్​కౌంటర్​లో చనిపోయారు. ఆయనతో పాటు 27 మంది ఈ ఎన్​కౌంటర్​లో మృతి చెందారు. అయితే ఆయన ఎన్​కౌంటర్​ కూడా కోవర్ట్​ ఆపరేషన్​తోనే చేపట్టినట్లు పౌర హక్కుల సంఘాలు (civil rights groups) ఆరోపిస్తున్నాయి.

Maoists | నక్సల్స్​ను పోలీసుల్లో చేర్పించిన నంబాల

మావోయిస్టులు, పోలీసులు ఇన్​ఫార్మర్లను పెట్టుకోవడం, కోవర్టు ఆపరేషన్లు నిర్వహించడం చేస్తుంటారు. ఈ క్రమంలో నంబాల కేశవరావు తన దగ్గర పనిచేసే ఐదుగురిని ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ DRGలో చేర్పించినట్లు సమాచారం. అనంతరం నంబాల దగ్గర పని చేసే ఇద్దరు నక్సల్స్ (Naxals) లొంగిపోయారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కోవర్ట్​ ఆపరేషషన్​ నిర్వహించినట్లు తెలిసింది. అంతేగాకుండా పోలీసుల ముసుగులో ఉన్న మావోయిస్టులను సైతం కనిపెట్టారు. అనంతరం వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Maoists | నంబాల కదలికలు కనిపెట్టి..

నంబాల ప్లాన్​ తెలిసిపోవడంతో పోలీసులు, బలగాలు ఆయన కదలికలపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో మే 21న జరిగిన ఎన్​కౌంటర్​లో ఆయనను హతమార్చాయి. తాజాగా మరో ఇద్దరు కీలక నేతలు సైతం కోవర్టు ఆపరేషన్​తోనే మృతి చెందినట్లు నక్సల్స్​ పేర్కొంటున్నారు. తెలంగాణకు (Telangana) చెందిన సత్యనారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి సోమవారం జరిగిన ఎన్​కౌంటర్​లో హతమయ్యారు. కోవర్టు ఆపరేషన్​తోనే బలగాలు ఎన్​కౌంటర్లు చేపడుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...