Operation Kagar | ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు జవాన్లకు గాయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Kagar | మావోయిస్టుల అంతమే లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్​ నిర్వహిస్తున్నాయి. 2026 మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Amit Shah) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వర్షాకాలంలో మావోలకు నిద్ర లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. దీంతో ఛత్తీస్​గఢ్​ (Chhattisgarh)లోని అడవులను బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Kagar | మావోయిస్టుల అంతమే లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్​ నిర్వహిస్తున్నాయి. 2026 మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Amit Shah) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వర్షాకాలంలో మావోలకు నిద్ర లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. దీంతో ఛత్తీస్​గఢ్​ (Chhattisgarh)లోని అడవులను బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.

బీజాపూర్​ జిల్లా నేషనల్​ పార్క్​ (Bijapur National Park) అటవీ ప్రాంతాన్ని సుమారు 25 వేల మంది బలగాలు, పోలీసులు చుట్టుముట్టాయి. నాలుగు రోజులుగా అటవీ ప్రాంతంలో సెర్చ్​ ఆపరేషన్​ (Search Operation) చేపడుతున్నాయి. ఈ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు కూంబింగ్​ చేపట్టారు. ముఖ్యంగా మావోయిస్టు కీలక నేత హిడ్మా (Hidma) టార్గెట్​గా ఆపరేషన్​ చేపట్టినట్లు సమాచారం.

Operation Kagar | కీలక నేత హతం

ఈ ఆపరేషన్​ భాగంగా ఇటీవల జరిగిన ఎన్​కౌంటర్​ మావోయిస్టుల స్నైపర్​, కీలక నేత సోధీ కన్నా హతమయ్యాడు. తాజాగా మంగళవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇంకా ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. కాగా నేషనల్ పార్క్ ప్రాంతంలో కాల్పులు ఆపి పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని పౌర హక్కుల నేతలు డిమాండ్​ చేస్తున్నారు.

Operation Kagar | చర్చలు లేవు

ఆపరేషన్​ కగార్​ (Operation Kagar)తో కకావికలం అయిన మావోయిస్టులకు ఇదివరకే తాము శాంతిచర్చలకు సిద్ధమని ప్రకటించారు. పౌర హక్కులు, కమ్యూనిస్ట్​ నాయకులు కూడా ఆపరేషన్​ కగార్​ ఆపి చర్చలు జరపాలని డిమాండ్​ చేస్తున్నారు. అయితే కేంద్ర మాత్రం మావోయిస్ట్​లతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఆయుధాలు వీడి లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని.. అంతకు మించి వారితో ఎలాంటి చర్చలు ఉండవని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...