Bijapur Encounter | బీజాపూర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు మావోయిస్టుల మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bijapur Encounter | ఛత్తీస్​గఢ్​ (Chhattisgarh)లో మరో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. బీజాపూర్‌ జిల్లాలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకోగా.. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వాయువ్య బీజాపూర్ జిల్లాలోని అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్, కమాండర్ పాపారావు ఉన్నాడనే సమాచారం మేరకు బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టాయి. బీజాపూర్‌ DRG, STF, కోబ్రా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bijapur Encounter | ఛత్తీస్​గఢ్​ (Chhattisgarh)లో మరో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. బీజాపూర్‌ జిల్లాలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకోగా.. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వాయువ్య బీజాపూర్ జిల్లాలోని అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్, కమాండర్ పాపారావు ఉన్నాడనే సమాచారం మేరకు బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టాయి. బీజాపూర్‌ DRG, STF, కోబ్రా సైనికుల ఆపరేషన్​లో పాల్గొన్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Bijapur Encounter | కొనసాగుతున్న ఆపరేషన్

ఈ ఎన్‌కౌంటర్ నేషనల్ పార్క్​ (National Park) ప్రాంతంలో జరుగుతోంది. ఇద్దరు నక్సల్స్​ చనిపోయారని, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

వరుస ఎన్​కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీ (Maoist Party) బలహీనంగా మారింది. మార్చి 31లోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) ధాటికి వందలాది మంది మావోలు ఎన్​కౌంటర్లలో చనిపోయారు. కీలక నేతలు హతం కావడంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పలువురు మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోతున్నారు. ఇందులో పార్టీ అగ్రనేతలు ఉండటం గమనార్హం. దీంతో త్వరలో కేంద్ర ప్రభుత్వ (Central Government) లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...