Govt Employees | ఉద్యోగులు ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందాల్సిందే.. ప్రభుత్వం కీలక నిర్ణయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Govt Employees | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనలో సాంకేతికత వినియోగాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టింది. కార్యాలయాల్లో పారదర్శకత, వేగం పెంచే లక్ష్యంతో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షను (computer proficiency test) తప్పని సరి చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిబంధన ప్రకారం ఉద్యోగులు కంప్యూటర్ పరీక్షలో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలి. జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్-కమ్-టైపిస్టులు, సీనియర్ స్టెనోగ్రాఫర్లు, జూనియర్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Govt Employees | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనలో సాంకేతికత వినియోగాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టింది. కార్యాలయాల్లో పారదర్శకత, వేగం పెంచే లక్ష్యంతో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షను (computer proficiency test) తప్పని సరి చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా నిబంధన ప్రకారం ఉద్యోగులు కంప్యూటర్ పరీక్షలో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలి. జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్-కమ్-టైపిస్టులు, సీనియర్ స్టెనోగ్రాఫర్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, యూడీ టైపిస్టులు, టైపిస్టులు, ఎల్​డీ టైపిస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్​ పోస్టులను నిర్వహిస్తున్న ఉద్యోగులు ఈ పరీక్షలో పాస్​ కావాల్సి ఉంటుంది. 2014 మే 12 తర్వాత విధుల్లో చేరిన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది.

ఉద్యోగి పరీక్షలో ఉత్తీర్ణత సాధించకుండానే పోస్టులకు నియమించబడితే వారి ప్రొబేషన్ వ్యవధిలో కంప్యూటర్లు, అనుబంధ సాఫ్ట్‌వేర్ వాడకంతో ఆఫీస్ ఆటోమేషన్‌లో ప్రావీణ్యం అనే డిపార్ట్‌మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది.

“కంప్యూటర్ అనుబంధ సాఫ్ట్‌వేర్ వాడకంలో ఆఫీస్ ఆటోమేషన్‌లో ప్రావీణ్యం పరీక్ష”ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...