Collector Nizamabad | ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పనిచేయాలి

అక్షర టుడే, ఇందూరు : Collector Nizamabad | ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో (Rajiv Gandhi Auditorium) ఆర్​వోలు, ఏఆర్వోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Vinay Krishna Reddy) మాట్లాడుతూ.. నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించవచ్చన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శిక్షణా తరగతుల్లో […]

అక్షర టుడే, ఇందూరు : Collector Nizamabad | ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో (Rajiv Gandhi Auditorium) ఆర్​వోలు, ఏఆర్వోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Vinay Krishna Reddy) మాట్లాడుతూ.. నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించవచ్చన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శిక్షణా తరగతుల్లో సూచించే అంశాలను శ్రద్ధగా విని, ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలన్నారు. ఎలాంటి సందేహాలున్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉందని, ఈ ఖాతా ద్వారానే ఎన్నికల కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీలు జరపాలని ఈసీ (Election Commission) నిర్దేశించినందున అభ్యర్థులకు విషయాన్ని తెలియజేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటీని, ఉపసంహరణ ప్రక్రియలను ఈసీ మార్గదర్శకాలకనుగుణంగా నిర్వహించాలని సూచించారు. సమయపాలన పక్కాగా పాటించాలని తెలిపారు. బ్యాలెట్ పేపర్​లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందన్నారు.

అభ్యర్థి ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే అన్ని నామపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. తిరస్కరణకు ఎన్ని గురయ్యాయి అందుకు గల కారణాలు వెల్లడించాలని తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేయాలని పేర్కొన్నారు. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన మీదట బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా రూపొందించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు వాటికి కేటాయించిన గుర్తులతో పాటు నోటా సింబల్​ను (Note Symbol) కూడా తప్పనిసరిగా చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, డీఎల్​పీవో శ్రీనివాస్, ఆర్వోలు, సహాయ ఆర్​వోలు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...