Election Commission | రాహుల్‌వి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు.. నిరాధార‌మ‌ని కొట్టిప‌డేసిన ఎన్నిక‌ల సంఘం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Election Commission | ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌(Gyanesh Kumar)పై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణలను భారత ఎన్నికల కమిషన్ గురువారం తోసిపుచ్చింది. అవి పూర్తిగా తప్పుడు, నిరాధారమైన ఆరోప‌ణ‌ల‌ని పేర్కొంది. “రాహుల్ గాంధీ(Rahul Gandhi) త‌ప్పు చెబుతున్నాడు. ఏ ఓట‌ర్ అయినా ఆన్‌లైన్‌లో ఓటు వేయడం కుద‌ర‌దు” అని కూడా తేల్చి చెప్పింది. రాహుల్‌గాంధీ గురువారం ఢిల్లీలో నిర్వ‌హిచంఇన విలేకరుల సమావేశంలో ఎన్నికల […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Election Commission | ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌(Gyanesh Kumar)పై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణలను భారత ఎన్నికల కమిషన్ గురువారం తోసిపుచ్చింది. అవి పూర్తిగా తప్పుడు, నిరాధారమైన ఆరోప‌ణ‌ల‌ని పేర్కొంది. “రాహుల్ గాంధీ(Rahul Gandhi) త‌ప్పు చెబుతున్నాడు.

ఏ ఓట‌ర్ అయినా ఆన్‌లైన్‌లో ఓటు వేయడం కుద‌ర‌దు” అని కూడా తేల్చి చెప్పింది. రాహుల్‌గాంధీ గురువారం ఢిల్లీలో నిర్వ‌హిచంఇన విలేకరుల సమావేశంలో ఎన్నికల కమిషన్‌(Election Commission)పై అనేక ఆరోపణలు చేసిన వెంటనే ఈసీ స్పందించింది.

Election Commission | బేస్‌లెస్ అలిగేష‌న్స్‌..

రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. కాంగ్రెస్ నాయకుడికి ప్రతిస్పందిస్తూ “రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తప్పు, అవి నిరాధారమైనవి. గాంధీ తప్పుగా భావించినట్లుగా, ఏ ఒక్క‌రి ఓటును కూడా ఆన్‌లైన్‌లో వ‌చ్చిన ఫిర్యాదు ఆధారంగా తొలగించరు. బాధిత వ్యక్తికి వినడానికి అవకాశం ఇవ్వకుండా ఏ తొలగింపు జరగదని” తేల్చి చెప్పింది. అయితే, 2023లో కర్ణాటకలోని అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించడానికి కొన్ని విఫల ప్రయత్నాలు జరిగాయని ఈసీ అంగీకరించింది . ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి స్వయంగా FIR కూడా దాఖలు చేసిన‌ట్లు తెలిపింది. “2023లో అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించడానికి కొన్ని విఫల ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ECI స్వయంగా FIR దాఖలు చేసింది. రికార్డుల ప్రకారం, అలంద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని 2018లో సుభాద్ గుత్తేదార్ (BJP), 2023లో BR పాటిల్ (INC) గెలుచుకున్నారు” అని ఈసీ పేర్కొంది.

Election Commission | ఈసీపై రాహుల్ తీవ్ర ఆరోప‌ణ‌లు..

అంత‌కు ముందు రాహుల్ గాంధీ CEC జ్ఞానేష్ కుమార్‌పై తీవ్ర దాడి చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వారిని ఆయ‌న‌ రక్షిస్తున్నారని ఆరోపించారు. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు, మైనారిటీలు సహా ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే వర్గాలకు చెందిన ఓట్లను తొలగించడానికి క్రమబద్ధమైన కుట్ర” జరుగుతోందని గాంధీ పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ ఆధారిత అవకతవకలను ఉపయోగించి కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో దాదాపు 6,018 ఓట్లను మోసపూరితంగా తొలగించారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగా దర్యాప్తులను అడ్డుకుంటోందన్నారు. కర్ణాటక CID 18 నెలల్లో ఎన్నికల కమిషన్‌కు 18 లేఖలు రాసినా స్పందించ‌లేద‌న్నారు. “కమిషన్ ఈ సమాచారాన్ని పంచుకోలేదు ఎందుకంటే తొలగింపు ఫారమ్‌లను దాఖలు చేయడానికి ఉపయోగించే IP చిరునామాలు, పరికర పోర్ట్‌లు, OTP ట్రయల్స్ వంటి ప్రాథమిక వివరాలను కోరినా స్పందించ‌లేద‌ని” ఆయన ఆరోపించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...