BJP Mlc | ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య

అక్షరటుడే, కామారెడ్డి:BJP Mlc |  ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి(Anji Reddy), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొమురయ్య(Komuraiah) పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాల(Saraswati Shishumandir School) ప్రాంగణంలో గురువారం రాత్రి తపస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. 12 ఏళ్ల పోరాటం తర్వాత బీజేపీ(BJP)కి రెండు ఎమ్మెల్సీలు దక్కాయన్నారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు ఎమ్మెల్సీలు, […]

అక్షరటుడే, కామారెడ్డి:BJP Mlc |  ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి(Anji Reddy), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొమురయ్య(Komuraiah) పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాల(Saraswati Shishumandir School) ప్రాంగణంలో గురువారం రాత్రి తపస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. 12 ఏళ్ల పోరాటం తర్వాత బీజేపీ(BJP)కి రెండు ఎమ్మెల్సీలు దక్కాయన్నారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు ఎమ్మెల్సీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. తమను గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

ఎమ్మెల్సీ కొమురయ్య మాట్లాడుతూ.. తమను గెలిపించినందుకు రుణపడి ఉంటామన్నారు. ఉపాధ్యాయ ఎన్ రోల్మెంట్ లో ప్రైవేట్ టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉందని, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ఈ సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలతో పాటు విద్యార్థులు(Students), విద్యావ్యవస్థ సమస్యల పరిష్కారం కూడా ముఖ్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో స్టేట్ సిలబస్(State Syllabus) ఉండదని, సిబిఎస్సి సిలబస్(CBSC Syllabus) మాత్రమే ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో వన్ ఎడ్యుకేషన్ పాలసీ(One Education POlicy) వచ్చే అవకాశం ఉందని, దానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

టీచర్లకు వారి సమస్యల పైన తప్ప విద్యార్థుల సమస్యలను పట్టించుకోరని ప్రభుత్వం(Government) దృష్టిలో ఉందని, ఈ విధానం మారాలన్నారు. ఎడ్యుకేషన్ విధానం ఇంప్రూవ్ కావాలన్నారు. సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందామని తెలిపారు. అనంతరం ఇద్దరు ఎమ్మెల్సీ(MLC)లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, తపస్ జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...