CM Revanth Reddy | చదువు మాత్రమే జీవితాన్ని మారుస్తుంది : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | చదువు మాత్రమే జీవితాన్ని మారుస్తుందని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా (Mahbubnagar district) జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో ట్రిపుల్​ ఐటీ (Triple IT) నిర్మాణానికి భూమిపూజ చేశారు. సీఎం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. లక్ష్యం ఉన్నతంగా ఉండాలని సూచించారు. కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన విద్య సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుందని తెలిపారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | చదువు మాత్రమే జీవితాన్ని మారుస్తుందని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా (Mahbubnagar district) జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో ట్రిపుల్​ ఐటీ (Triple IT) నిర్మాణానికి భూమిపూజ చేశారు.

సీఎం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. లక్ష్యం ఉన్నతంగా ఉండాలని సూచించారు. కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన విద్య సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుందని తెలిపారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యం అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సివిల్స్ రాసేవారిని (Civil Services examination) ప్రోత్సహించేందుకు మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఎంపికైన యువతకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

తల్లిదండ్రులను మరువొద్దు

ఎంత ఎదిగినా తల్లిదండ్రులను, పుట్టిన ఊరును మరువొద్దని సీఎం సూచించారు. భవిష్యత్తు చదువుపైనే ఆధారపడి ఉందన్నారు. 25 ఏళ్ల వరకు కష్టపడి చదువుకుంటే.. సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు జమీందార్లు, జాగీర్దార్ల వద్ద ఉన్న భూములను తీసుకుని భూమిలేని నిరుపేదలకు పంచారన్నారు. పేదలకు పంచేందుకు ఇప్పుడు భూములు లేవన్నారు. ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్య మాత్రమే అని పేర్కొన్నారు. చిట్టబోయినపల్లిలో ఐఐఐటీ భవనం ఏడాదిలోగా పూర్తవుతుందన్నారు. తాను 17 ఏళ్ల వ్యవధిలో అన్ని చట్టసభల్లో పని చేసినట్లు చెప్పారు. విజయం సాధించాలంటే పట్టుదల ఉండాలని ఆయన సూచించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...