Falcon Case | విమానాన్ని వేలం వేయనున్న ఈడీ.. ఎందుకంటే?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Falcon Case | ఫాల్కన్‌ కేసులో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో స్వాధీనం చేసుకున్న విమానాన్ని వేలం వేయనున్నట్లు ప్రకటించింది. బేగంపేట ఎయిర్‌పోర్టు (Begumpet Airport)లో విమానానికి డిసెంబర్​ 9న అధికారులు ఆన్​లైన్​లో వేలం నిర్వహించనున్నారు. బేగంపేట విమానాశ్రయంలో నిలిపి ఉంచిన హాకర్ 800A విమానాన్ని వేలం వేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ నంబర్ N935H కలిగిన ఈ విమానం డిసెంబర్ 7 వరకు తనిఖీ కోసం అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Falcon Case | ఫాల్కన్‌ కేసులో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో స్వాధీనం చేసుకున్న విమానాన్ని వేలం వేయనున్నట్లు ప్రకటించింది. బేగంపేట ఎయిర్‌పోర్టు (Begumpet Airport)లో విమానానికి డిసెంబర్​ 9న అధికారులు ఆన్​లైన్​లో వేలం నిర్వహించనున్నారు.

బేగంపేట విమానాశ్రయంలో నిలిపి ఉంచిన హాకర్ 800A విమానాన్ని వేలం వేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ నంబర్ N935H కలిగిన ఈ విమానం డిసెంబర్ 7 వరకు తనిఖీ కోసం అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 9న MSTC లిమిటెడ్ ద్వారా వేలం చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ డబ్బును మోసానికి గురైన బాధితులకు పరిహారం చెల్లించడానికి ఉపయోగించనున్నారు.

Falcon Case | రూ.792 కోట్ల మోసం

ఇన్‌వాయిస్-డిస్కౌంటింగ్ పేరుతో ఫాల్కన్ గ్రూప్ (క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్), దాని CMD అమర్‌దీప్ కుమార్‌పై ఫిబ్రవరి 11న సైబరాబాద్ (Cyberabad) ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది. అనంతరం ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో పెట్టుబడిదారులను రూ.792 కోట్లకు మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. అమర్‌దీప్ కుమార్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్​కు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నిర్వహించిన సోదాల సమయంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport)లో మార్చి 7న అధికారులు విమానాన్ని సీజ్​ చేశారు.

Falcon Case | ముగ్గురి అరెస్ట్

ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి ముందే అమర్‌దీప్ కుమార్ అదే విమానాన్ని ఉపయోగించి దేశం విడిచి పారిపోయాడు. ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు రూ.18.63 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. అమర్‌దీప్ సోదరుడు సందీప్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర తోష్నివాల్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీవోవో ఆర్యన్ సింగ్ ఛబ్రాను అదుపులోకి తీసుకుంది.

Falcon Case | వేలానికి అనుమతి లభించడంతో..

ఈ కేసులో స్వాధీనం చేసుకున్న విమానాన్ని అమర్‌దీప్ కుమార్ 2024లో కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. దానిని స్వాధీనం చేసుకున్న తర్వాత వేలం వేయడానికి అడ్జుడికేటింగ్ అథారిటీ (Adjudicating Authority) ని అనుమతి కోరింది. నవంబర్​ 20 వేలానికి ఆమోదం లభించింది. దీంతో ఈ నెల 9న ఆన్​లైన్​లో వేలంపాట నిర్వహించనున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...