AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కామ్‌ దర్యాప్తులో కీలక మలుపు.. విజయసాయిరెడ్డికి ఈడీ సమన్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్: AP Liquor Scam | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలను కుదిపేసిన లిక్కర్ స్కామ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని ఈడీ స్పష్టం చేసింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం (YSRCP Government) అమలు చేసిన మద్యం విధానంలో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: AP Liquor Scam | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలను కుదిపేసిన లిక్కర్ స్కామ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) నోటీసులు జారీ చేసింది.

ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని ఈడీ స్పష్టం చేసింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం (YSRCP Government) అమలు చేసిన మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం విక్రయాల ద్వారా పెద్ద ఎత్తున నగదు దారి మళ్లినట్టు ఆధారాలు లభించడంతో ఈ కేసులోకి ఈడీ రంగంలోకి దిగింది.

AP Liquor Scam | ఈడీ స‌మ‌న్లు..

మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తును చేపట్టిన ఈడీ ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, అధికారులు, వ్యాపారవర్గాలకు చెందిన వ్యక్తులను ప్రశ్నించింది. అక్రమంగా వచ్చిన నగదును విదేశాలకు తరలించి, బ్లాక్ మనీని వైట్‌గా మార్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఆ నిధులను ఎన్నికల ఖర్చుల కోసం వినియోగించారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి (Vijay Sai Reddy)ని విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిట్ అందించిన ఆధారాలను ఇప్పటికే అధ్యయనం చేసిన ఈడీ, దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా నగదు లావాదేవీలు ఎలా జరిగాయి, మద్యం పాలసీ రూపకల్పనలో ఎవరి పాత్ర ఎంత వరకు ఉంది, అమలు దశలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశాలపై స్పష్టత రాబట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ముఖ్యంగా నగదు రూపంలోనే వ్యాపారం ఎందుకు సాగిందన్న అంశంపై లోతుగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీ లోపలి అవమానాల కారణంగా గతంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసిన ఆయన, ఆ తర్వాత రాజకీయాలపై స్పందించడం మానేశారు. వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటానని అప్పట్లో ప్రకటించారు. అయినప్పటికీ, గత ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో వివిధ కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఆయనను విచారిస్తున్నాయి. ఇంతకుముందు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ లిక్కర్ కేసులోనే విజయసాయిరెడ్డిని పలుమార్లు ప్రశ్నించింది. అలాగే కాకినాడ పోర్టు వ్యవహారం, జగన్‌కు సంబంధించిన కేసుల్లో కూడా ఆయన ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో మరోసారి ఈడీ ఎదుట హాజరుకానుండటంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేడెక్కనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...