Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) (Enforcement Directorate – ED) సమన్లు జారీ చేసింది. యూకే ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ భండారీ(UK arms consultant Sanjay Bhandari)కి సంబంధించిన కేసులో రాబర్ట్ వాగ్మూలాన్ని రికార్డ్ చేయడానికే ఈ సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. Robert Vadra : జూన్​​ 17న విచారణ […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) (Enforcement Directorate – ED) సమన్లు జారీ చేసింది. యూకే ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ భండారీ(UK arms consultant Sanjay Bhandari)కి సంబంధించిన కేసులో రాబర్ట్ వాగ్మూలాన్ని రికార్డ్ చేయడానికే ఈ సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Robert Vadra : జూన్​​ 17న విచారణ

సంజయ్​ భండారీ అక్రమ నగదు చలామణి (మనీ లాండరింగ్) కేసులో తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి జూన్​ 17న ఈడీ ఎదుట రాబర్ట్ వాద్రా హాజరుకావాలని కోరినట్లు అధికారులు వెల్లడించారు.

Robert Vadra : అనారోగ్య సమస్యలు

జూన్​ 10నే ఈడీ విచారణకు వాద్రా హాజరు కావాల్సి ఉంది. కానీ, 56 ఏళ్ల వాద్రా తనకు జూన్​ 9న ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నాయని, ప్రొటోకాల్ ప్రకారం కొవిడ్ పరీక్ష చేయించుకున్నానని చెప్పి, విచారణకు డుమ్మా కొట్టారు.

అయితే, ఈడీ సమన్లను తప్పించుకునే ఉద్దేశం వాద్రాకు లేదని, ఈ నెల చివరలో తన విదేశీ ప్రయాణానికి ముందుగానీ, తర్వాత ఎప్పుడైనా ఈడీ ఎదుట హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు రాబర్ట్ తరఫు న్యాయవాది అప్పట్లో వివరణ ఇచ్చారు.

అయితే, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్​ (పీఎంఎల్​ఏ) కింద వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి, తర్వాత ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి వాద్రాకు ఈడీ తాజా సమన్లు​ జారీ చేసినట్లు చెబుతున్నారు.

Robert Vadra : మొత్తం 3 కేసులున్నాయ్​!

మూడు మనీ లాండరింగ్ కేసుల్లో వాద్రాను ఈడీ విచారణ చేపడుతోంది.

  • 2008లో హరియాణా(Haryana)లో జరిగిన ఓ భూ ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంగా వాద్రాను ఈడీ మూడు రోజులపాటు ప్రశ్నించింది.
  • రాజస్థాన్(Rajasthan) బికనీర్(Bikaner)​లో జరిగిన ఓ భూ ఒప్పందంలో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఈ మనీలాండరింగ్ కేసులోనూ వాద్రాపై ఈడీ దర్యాప్తు చేపడుతోంది.
  • ఢిల్లీ(Delhi)లో 2016లో సంజయ్​ భండారీ(63)పై ఆదాయపు పన్ను శాఖ రైడింగ్ చేపట్టింది. ఈ ఘటన జరిగిన వెంటనే అతడు లండన్ పారిపోయాడు. అతడిని భారత్​కు తిరిగి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవల బ్రిటన్ సుప్రీంకోర్టులో భారత్ ప్రభుత్వం అప్పీల్ చేసింది. కానీ, దానిని యూకే కోర్టు తిరస్కరించింది. దీంతో భండారీని మన దేశానికి తీసుకొచ్చే అవకాశాలు లేకుండా పోయాయి.

2009లో లండన్​(London)లో 12, బ్రయాన్​స్టన్​ స్క్వేర్​ ఇంటిని భండారీ కొనుగోలు చేశాడు. దానిని రెనోవేషన్ చేయమని కోరుతూ వాద్రా డబ్బులు ఇచ్చినట్లు ఈడీ 2023లో ఛార్జ్ షీట్​ దాఖలు చేసింది. అయితే, తనకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ లండన్​లో ఎలాంటి ఆస్తులు లేవని రాబర్ట్ వాదిస్తున్నారు. ‘రాజకీయ కక్ష’లతోనే తనపై ఈడీ కేసులు పెట్టి ‘వెంటాడి, వేధిస్తున్నారు’ అని పేర్కొంటున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...