Vikarabad | వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vikarabad | వికారాబాద్ జిల్లాలో గురువారం సాయంత్ర స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పూడూరు మండలం (Pudur mandal) రాకంచెర్ల గ్రామంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో (earthquake) ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం సమయంలో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంట్లోని సామగ్రి కదిలినట్లు పేర్కొన్నారు. దీంతో ఇళ్లనుంచి బయటకు వచ్చామన్నారు. అనంతరం చాలా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vikarabad | వికారాబాద్ జిల్లాలో గురువారం సాయంత్ర స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పూడూరు మండలం (Pudur mandal) రాకంచెర్ల గ్రామంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ఒక్కసారిగా భూమి కంపించడంతో (earthquake) ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం సమయంలో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంట్లోని సామగ్రి కదిలినట్లు పేర్కొన్నారు. దీంతో ఇళ్లనుంచి బయటకు వచ్చామన్నారు. అనంతరం చాలా సేపటి వరకు భయంతో బయటే ఉండిపోయినట్లు వారు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

Vikarabad | పరిశీలించిన అధికారులు

సమాచారం అందుకున్న అధికారులు గ్రామానికి చేరుకున్నారు. తహసీల్దార్, పోలీసులు రాకంచెర్లకు (Rakancherla) చేరుకొని వివరాలు సేకరించారు. అయితే భూ ప్రకంపనలు గల కారణాలపై జియోలాజికల్ సర్వే అధికారులు (Geological Survey officials) అధ్యయనం చేయనున్నట్లు సమాచారం. కాగా రెండు నెలల క్రితం పరిగి మండలంలోని పలు గ్రామాల్లో ఇదే విధంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...