E-Dip registration | శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ముగిసిన ఈ-డిప్ రిజిస్ట్రేషన్

అక్షరటుడే, వెబ్​డెస్క్​: E-Dip registration | తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ (E-Dip registration) ముగిసింది. రిజిస్ట్రేషన్లను ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ప్రారంభించగా.. నేడు సాయంత్రం 5 గంటలకు పూర్తియింది. ఇందులో భాగంగా మొత్తం 1.8 లక్షల టోకన్ల కోసం రికార్డు స్థాయిలో 24 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. కాగా.. మంగళవారం ఈ–డిప్​ నిర్వహించి టోకెన్లు అందజేయనున్నారు. E-Dip registration | డిసెంబర్​ 30 […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: E-Dip registration | తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ (E-Dip registration) ముగిసింది. రిజిస్ట్రేషన్లను ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ప్రారంభించగా.. నేడు సాయంత్రం 5 గంటలకు పూర్తియింది. ఇందులో భాగంగా మొత్తం 1.8 లక్షల టోకన్ల కోసం రికార్డు స్థాయిలో 24 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. కాగా.. మంగళవారం ఈ–డిప్​ నిర్వహించి టోకెన్లు అందజేయనున్నారు.

E-Dip registration | డిసెంబర్​ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం

ఈ–డిప్​ రిజిస్ట్రేషన్లలో టోకెన్లు వచ్చిన భక్తులకు మూడు రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం (Vaikuntha Dwara Darshan) కల్పించనున్నారు. డిసెంబర్​ 30, 31, జనవరి 1వ తేదీల్లో దర్శన అవకాశం ఇవ్వనున్నారు. మొత్తం 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24, 05,237లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ (TTD mobile app) ద్వారా 13.4 లక్షల మంది భక్తులు, టీటీడీ వెబ్ సైట్​లో 9.3లక్షలు, ఏపీ గవర్నమెంట్ వాట్సాప్​ (AP Government WhatsApp) ద్వారా 1.5 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం యథాతథంగా కొనసాగనుంది.

E-Dip registration | డిసెంబర్​ 5న ఆన్​లైన్​ దర్శనం టికెట్లు విడుదల

జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు 7 రోజులకు సంబంధించి 300 దర్శనం టికెట్లు, రోజుకు వెయ్యి శ్రీవాణి టికెట్లు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి డిసెంబర్​ 5వ తేదీన ఆన్​లైన్​లో రిలీజ్​ చేస్తారు. చివరి మూడు రోజులు జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికుల కోసం రోజుకు 5వేల టోకన్లు ఇవ్వనున్నారు. వీటిని డిసెంబర్ నెల 10వ తేదీన విడుదల చేయనున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...