CP Sai Chaitanya | దుర్గామాత మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | దుర్గామాత (Durga Matha) మండపాల నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దుర్గామాత విగ్రహ ఏర్పాటు కోసం ప్రజల నుంచి డబ్బులను బలవంతంగా వసూలు చేయొద్దన్నారు. మండపాలను ట్రాఫిక్ (Traffic) ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారికి […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | దుర్గామాత (Durga Matha) మండపాల నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

దుర్గామాత విగ్రహ ఏర్పాటు కోసం ప్రజల నుంచి డబ్బులను బలవంతంగా వసూలు చేయొద్దన్నారు. మండపాలను ట్రాఫిక్ (Traffic) ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారికి సమాచారం ఇవ్వాలన్నారు.

CP Sai Chaitanya | జాగ్రత్తలు పాటించాలి

దుర్గామాత మండపాలను సందర్శించే మహిళలు, యువతులపై ఈవ్ టీజింగ్ జరుగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని సీపీ సూచించారు. సౌండ్​ సిస్టం (Sound System) ఏర్పాటు విషయంలో ప్రజలు ఇబ్బందులు కల్గకుండా చూడాలన్నారు. రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలని, ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజేల ఏర్పాటుపై నిషేధం ఉందన్నారు.

CP Sai Chaitanya | మండపం దగ్గర ఉండాలి

దుర్గామాత మండలి వద్ద ఎల్లప్పుడు ఇద్దరూ లేదా ముగ్గురికి తక్కువ కాకుండా నిర్వాహకులు ఉండాలని సీపీ ఆదేశించారు. పోలీసులు చెకింగ్​కు వచ్చినప్పుడు ప్రతీసారి కనబడాలన్నారు. ప్రతి మండలి దగ్గర విధిగా పుస్తకం ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో సంతకం చేస్తారన్నారు. మండపాలను పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలని, ఏమైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...