Hyderabad | డ్రంకన్​ డ్రైవ్​ స్పెషల్ తనిఖీలు.. ఎంత మంది చిక్కారంటే?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్​ రద్దీ పెరుగుతోంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడపడటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు నిత్యం డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు (Drunk driving checks) చేపడుతున్నారు. వీకెండ్​లో స్పెషల్​ తనిఖీలు చేపట్టి మందుబాబుల ఆట కట్టిస్తున్నారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 5, […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్​ రద్దీ పెరుగుతోంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడపడటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు నిత్యం డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు (Drunk driving checks) చేపడుతున్నారు. వీకెండ్​లో స్పెషల్​ తనిఖీలు చేపట్టి మందుబాబుల ఆట కట్టిస్తున్నారు.

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 5, 6 తేదీల్లో నగర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు మొత్తం 474 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు.

Hyderabad | వారే అధికం..

మద్యం తాగి దొరుకుతున్న వారిలో ద్విచక్ర వాహనదారులే అధికంగా ఉంటున్నారు. తాజాగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 381 మంది బైకర్లు చిక్కారు. త్రిచక్ర వాహనాల డ్రైవర్లు 26 మంది, ఇతరులు 67 మంది పట్టుబడ్డారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) మద్యం తాగి వాహనాలు నడపడాన్ని ఉపేక్షించడం లేదు. రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరారు.

నగరంలో పోలీసులు ఇటీవల ఆపరేషన్​ కవచ్ (Operation Kavach)​ నిర్వహించారు. దాదాపు 5 వేల పోలీసు సిబ్బంది 150 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అనేక వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేశారు. రాత్రిపూట అనవసరంగా తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్​ ఇచ్చారు. సీపీ సజ్జనార్​ సైతం తనిఖీల్లో పాల్గొన్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...