Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Congress | మీనాక్షి నటరాజన్​ను కలిసిన డాక్టర్​ కూనీపూర్​ రాజారెడ్డి

Kamareddy Congress | మీనాక్షి నటరాజన్​ను కలిసిన డాక్టర్​ కూనీపూర్​ రాజారెడ్డి

కాంగ్రెస్ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ను డాక్టర్ రాజారెడ్డి హైదరాబాద్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్​ సావంత్​తో కలిసి ఆమెను కలిశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Congress | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ను డాక్టర్ రాజారెడ్డి (Dr. Raja Reddy) హైదరాబాద్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్​ సావంత్​తో కలిసి ఆయన శుక్రవారం మీనాక్షి నటరాజన్​ను కలిశారు. గతంలో కామారెడ్డి జిల్లా (Kamareddy District) అధ్యక్ష పదవికోసం డాక్టర్​ రాజారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25ఏళ్లుగా కాంగ్రెస్​ పార్టీకి సేవ చేసిన తనకు న్యాయం చేస్తామని మీనాక్షి నటరాజన్​ (Meenakshi Natarajan) హామీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్​ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నానని.. యూనివర్సిటీ ఎన్​ఎస్​యుఐ అధ్యకుడిగా పనిచేశానన్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్​లో పదేళ్లు పనిచేశానని.. ఎన్ని ఇబ్బందులున్నా పార్టీని వదిలిపెట్టి వెళ్లలేదన్నారు. తనకు పార్టీ పరంగా న్యాయం చేస్తామని మీనాక్షి నటరాజన్​ హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.

Must Read
Related News