ePaper
More
    HomeతెలంగాణRahul Gandhi | డ‌బుల్ ఇంజిన్ స‌ర్కారు.. ధోకేబాజే స‌ర్కారు.. ఎన్టీయే ప్ర‌భుత్వంపై రాహుల్ ధ్వ‌జం

    Rahul Gandhi | డ‌బుల్ ఇంజిన్ స‌ర్కారు.. ధోకేబాజే స‌ర్కారు.. ఎన్టీయే ప్ర‌భుత్వంపై రాహుల్ ధ్వ‌జం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | డబుల్ ఇంజిన్ స‌ర్కారు.. ధోకేబాజే స‌ర్కారు అని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ విమ‌ర్శించారు. బీహార్‌లో గురువారం ప‌ర్య‌టించిన ఆయ‌న అంబేద్క‌ర్ హాస్ట‌ల్‌లో విద్యార్థుల‌ను క‌లిసేందుకు వెళ్తుండ‌గా పోలీసులు(Police) అడ్డుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాహుల్‌గాంధీ ఎన్డీఏ ప్రభుత్వం(NDA Government)పై విమర్శలు గుప్పించారు. బీహార్‌లోని అంబేద్కర్ హాస్టల్‌లో దళిత, వెనుకబడిన విద్యార్థులను కలవకుండా ఎన్డీయే ప్రభుత్వం తనను అడ్డుకుంటోందన్నారు. విద్యార్థులను కలవడానికి హాస్టల్‌కు వెళుతుండగా బీహార్ పోలీసులు(Bihar Police) తనను ఆపారని తెలిపారు. “బీహార్ పోలీసులు నన్ను ఆపడానికి ప్రయత్నించారు. కానీ మీ శక్తి (మైనారిటీ సమాజం) నన్ను గమనిస్తున్నందున వారు నన్ను ఆపలేకపోయారు. జనాభా గణన నిర్వహించాలని మేము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)కి చెప్పాము. మీ ఒత్తిడితో, ప్రధానమంత్రి మోదీ దేశంలో కుల గణనను ప్రకటించారు. మీ ఒత్తిడికి భయపడి, ఆయన రాజ్యాంగాన్ని తన నుదిటిపై ఉంచుకున్నారు. కానీ వారి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, మైనారిటీలకు వ్యతిరేకం” అని రాహుల్ విమ‌ర్శించారు.

    Rahul Gandhi | కాంగ్రెస్‌ను ఆద‌రించండి..

    దేశంలో రాజ్యాంగానికి ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. భారతదేశంలో, బీహార్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజలకు అర్హమైన ప్రతిదీ అమలు అవుతుంద‌ని చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌(Bihar Chief Minister Nitish Kumar)ను సైతం రాహుల్ విమ‌ర్శించారు. త‌న‌ను బీహార్‌కు రానివ్వడానికి మీరు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. “బీహార్‌లోని ఎన్డీయే “డబుల్ ఇంజిన్ ధోకేబాజ్ సర్కార్” అంబేద్కర్ హాస్టల్‌(Ambedkar Hostel)లో దళిత, వెనుకబడిన విద్యార్థులతో మాట్లాడ‌కుండా నన్ను నిరోధిస్తోంది. విద్యార్థుల‌తో మాట్లాడ‌డం ఎప్పటి నుంచి నేరంగా మారింది? నితీష్ జీ, మీరు దేనికి భయపడుతున్నారు? బీహార్‌లో విద్య, సామాజిక న్యాయం స్థితిని మీరు దాచాలనుకుంటున్నారా?” రాహుల్ అన్నారు. “భారతదేశం ప్రజాస్వామ్యం, దీనిని రాజ్యాంగం నడుపుతుంది, నియంతృత్వం కాదు! సామాజిక న్యాయం, విద్య కోసం మన గొంతును లేవనెత్తకుండా ఎవరూ ఆపలేరు” అని రాహుల్ అన్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...