Kotagiri Mandal | డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బిల్లులు చెల్లించాలి

అక్షర టుడే, కోటగిరి: Kotagiri Mandal | డబుల్ బెడ్రూం ఇళ్ల బిల్లులు చెల్లించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కోటగిరి మండల (Kotagiri Mandal) కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా.. స్పందించడం లేదన్నారు. రెండేళ్లుగా బిల్లులు లేక లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని […]

అక్షర టుడే, కోటగిరి: Kotagiri Mandal | డబుల్ బెడ్రూం ఇళ్ల బిల్లులు చెల్లించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కోటగిరి మండల (Kotagiri Mandal) కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా.. స్పందించడం లేదన్నారు. రెండేళ్లుగా బిల్లులు లేక లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వాపోయారు. ఒకరి బిల్లులను మరొకరికి ఇచ్చి డబుల్ బెడ్​రూం బిల్లుల (double bedroom bills) చెల్లింపులో అవినీతికి పాల్పడ్డారని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సమయంలో ఓట్ల కోసం నాయకులు తమ అనుచరులకు డబుల్ బెడ్ రూం బిల్లులను అందించారని, అర్హులైన లబ్ధిదారులకు మాత్రం బిల్లులు ఇవ్వలేదని మండిపడ్డారు.

Kotagiri Mandal | విచారణ జరిపించాలి

ఈ వ్యవహారంపై కాంట్రాక్టర్, మాజీ ప్రజాప్రతినిధుల పాత్రపై విచారణ (investigation) జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెలాఖరుకు హౌసింగ్ శాఖ అధికారి నాగేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారని, వెంటనే లబ్ధిదారులకు బిల్లులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కొందరు ప్రజాప్రతినిధులు 23 మందికి మాత్రమే బిల్లులు రావాల్సి ఉందని చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎవరెవరికి ఎన్ని బిల్లులు రావాలో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

సుమారు 100 మంది వరకు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల బిల్లులు రావాల్సి ఉందన్నారు. బిల్లులు ఇవ్వకుండా మాయమాటలు చెబుతున్నారని, కొందరు ప్రజాప్రతినిధులు బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. వారం రోజుల్లో బిల్లులు చెల్లించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్, సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు యముల నవీన్, పుల్లెల మోహన్, సమీర్, సంతోష్  తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...