CM Revanth Reddy | పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మందుకు ఓటు వేయొద్దు : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) డబ్బు, మందుకు ఆశపడి ఓటు వేయొద్దని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. మంచి వ్యక్తులు గ్రామ సర్పంచులుగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఆయన కొత్తగూడెంలో పర్యటించారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఏర్పాటు చేసిన డా.మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్​ పాలనపై విమర్శలు చేశారు. బీఆర్​ఎస్ (BRS)​ హయాంలో చేపట్టిన […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) డబ్బు, మందుకు ఆశపడి ఓటు వేయొద్దని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. మంచి వ్యక్తులు గ్రామ సర్పంచులుగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఆయన కొత్తగూడెంలో పర్యటించారు.

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఏర్పాటు చేసిన డా.మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్​ పాలనపై విమర్శలు చేశారు. బీఆర్​ఎస్ (BRS)​ హయాంలో చేపట్టిన ప్రాజెక్ట్​లు కేసీఆర్​ కుటుంబానికి కనక వర్షం కురిపించాయన్నారు. కేసీఆర్‌ హయాంలో ఖమ్మం జిల్లాకు న్యాయం జరగలేదన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్​కు కంచుకోట అన్నారు. తమ ప్రభుత్వం ఈ జిల్లా నుంచే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. శ్రీరాముడి సాక్షిగా ఖమ్మం (Khammam) జిల్లాను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

CM Revanth Reddy | పాల్వంచలో ఉద్యమానికి పునాది

తెలంగాణ ఉద్య‌మానికి స్పూర్తినిచ్చిన ప్రాంతం కొత్త‌గూడెం అని సీఎం అన్నారు. 1969 తొలిదశ ఉద్యమానికి పునాదులు పడింది పాల్వంచలోనే అని గుర్తు చేశారు. థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో నాన్‌ లోకల్ వ్యక్తుల్ని తీసుకోవడంతో పాల్వంచలో ఉద్యమం రాజుకుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమైన శాఖలన్ని జిల్లాకు చెందిన నాయకులు భట్టి, తుమ్మల, పొంగులేటి దగ్గరే ఉన్నాయని పేర్కొన్నారు. డా.మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని జిల్లాలో ఏర్పాటు చేయడంపై మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యూనివర్సిటీ దేశానికే తలమానికం అవుతుందన్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...