Indalwai | దళారులను నమ్మి మోసపోవద్దు

అక్షర టుడే, ఇందల్వాయి: Indalwai | రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆర్డీవో రాజేందర్ (RDO Rajender) అన్నారు. ఇందల్వాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (paddy purchase center) సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని అధికారులకు సూచించారు. ఏ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.2389, బి గ్రేడ్ రకానికి రూ.2369 మద్దతు చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు ధాన్యం తేమశాతం 17 ఉండేలా చూసుకోవాలన్నారు. […]

అక్షర టుడే, ఇందల్వాయి: Indalwai | రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆర్డీవో రాజేందర్ (RDO Rajender) అన్నారు. ఇందల్వాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (paddy purchase center) సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని అధికారులకు సూచించారు.

ఏ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.2389, బి గ్రేడ్ రకానికి రూ.2369 మద్దతు చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు ధాన్యం తేమశాతం 17 ఉండేలా చూసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్య ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించాలని రైతులకు (Farmers) సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఆయన వెంట తహశీల్దార్ వెంకట్ రావు, సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, మానిటరింగ్ అధికారి మయూరి, మాజీ చైర్మన్ గోపాల్, ఆర్.రె మోహన్, సొసైటీ సీఈవో శ్రీకాంత్, సొసైటీ డైరెక్టర్లు రైతులు ఉన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...