Government advisor Mohammed Ali Shabbir : పదవుల కోసం పాకులాడొద్దు.. ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి : షబ్బీర్ అలీ
Government advisor Mohammed Ali Shabbir : పదవుల కోసం పాకులాడొద్దు.. ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి : షబ్బీర్ అలీ

అక్షరటుడే, ఇందూరు: Government advisor Shabbir Ali : పదవుల కోసం పాకులాడకుండా ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని కార్యకర్తలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హితబోధ చేశారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని బస్వా గార్డెన్ లో బుధవారం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కేశవేణు kesha venu nizamabad అధ్యక్షతన పార్టీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

ముఖ్య అతిథిలుగా మహమ్మద్ అలీ షబ్బీర్, పట్టణ ఇన్​ఛార్జి ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ మనాల మోహన్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, అలాంటి వారికి తప్పకుండా భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయాలని సూచించారు.