పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులతోపాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు సెల్ఫోన్ల అనుమతి లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు.
అమాయక ప్రజలపై అసాంఘిక శక్తుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఈ మేరకు ఆయన బాధితులతో కలిసి సీపీ సాయి చైతన్యకు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాల్లో విద్యాసంస్థల ఏర్పాటుకు నాయకులు కృషి చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జీగా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన మంత్రి గణేష్ నియమితులయ్యారు. ఆయనకు మంగళవారం నియామకపత్రం అందజేశారు.
విద్యార్థులకు, క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. వారి ఉన్నతికి విశేష కృషి చేస్తున్న జడ్పీహెచ్ఎస్ పేట్సంగం పీఈటీ, బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు లక్ష్మణ్రాథోడ్కు ఇండియన్ బెస్ట్ ఇన్స్పిరేషన్ అవార్డు వరించింది.