Mother love | మసకబారిన తల్లి ప్రేమ.. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని 5 నెలల పసికందును చంపేసిన అమ్మ, అమ్మమ్మ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mother love : సృష్టిలో అమూల్యమైనది తల్లిప్రేమ.. ఎలాంటి కల్మషం లేనిది.. ఎంతో పవిత్రమైనది.. వెల కట్టలేనిది.. అంతకు మించింది మరోటి లేదనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ తల్లీబిడ్డలు మాతృప్రేమను కలుషితం చేశారు. కన్నప్రేమకు అర్థమే మార్చారు. ముక్కుపచ్చలారని చిన్నారిని దారుణంగా కడతేర్చారు. ఎన్నో ఆశయాలతో ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఆ పసికందు.. అమ్మను గుర్తుపట్టేలోపే అమ్మ, అమ్మమ్మనే కాలయముడిగా మారారు. కులం కోసం మానవత్వం, నైతిక విలువలు, చివరికి మానవ బంధాలనే […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mother love : సృష్టిలో అమూల్యమైనది తల్లిప్రేమ.. ఎలాంటి కల్మషం లేనిది.. ఎంతో పవిత్రమైనది.. వెల కట్టలేనిది.. అంతకు మించింది మరోటి లేదనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ తల్లీబిడ్డలు మాతృప్రేమను కలుషితం చేశారు. కన్నప్రేమకు అర్థమే మార్చారు. ముక్కుపచ్చలారని చిన్నారిని దారుణంగా కడతేర్చారు. ఎన్నో ఆశయాలతో ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఆ పసికందు.. అమ్మను గుర్తుపట్టేలోపే అమ్మ, అమ్మమ్మనే కాలయముడిగా మారారు. కులం కోసం మానవత్వం, నైతిక విలువలు, చివరికి మానవ బంధాలనే ప్రశ్నార్థకంగా మిగిల్చారు.

రెండో పెళ్లికి అడ్డుగా ఉందని అమ్మ, అమ్మమ్మ కలిసి ఐదు నెలల పసికందును చంపేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh లోని పిఠాపురం మండలం Pithapuram mandal లో చోటుచేసుకుంది. నరసింగపురానికి చెందిన శైలజ రెండేళ్ల క్రితం సతీష్ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

కొద్ది నెలల క్రితం తిరిగి ఇంటికొచ్చిన శైలజ.. ఐదు నెలల క్రితం యశ్విత అనే పండంటి పసిబిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా.. శైలజ మనసు మార్చేసి, ఆమెకు తన కులానికి చెందిన వ్యక్తితో రెండో పెళ్లి జరిపించాలని శైలజ అమ్మ అన్నవరం నిర్ణయించింది.

ఇందుకు పాప యశ్విత అడ్డు తొలగించాలని భావించింది. ఈ నెల 6న ఐదు నెలల పసికందును గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఇంటి పక్కనే ఉన్న బావిలో పడేసింది. తర్వాత ఎవరో క్షుద్ర పూజలు చేసి తమ చిన్నారిని చంపేశారని ప్రచారం చేశారు. ఇందుకు అనుగుణంగా ఇంటి ముందర ముగ్గు వేసి, నిమ్మకాయలు పెట్టి నమ్మించారు. కానీ, పోలీసులకు అనుమానం వచ్చి, తమ స్టైల్​లో విచారణ చేపట్టగా.. చిన్నారిని తామే చంపినట్లు అమ్మ, అమ్మమ్మ ఒప్పుకొన్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...