- Advertisement -
HomeజాతీయంMaoists | మావోయిస్ట్​ పార్టీలో విభేదాలు.. అభయ్​ను ద్రోహిగా పేర్కొన్న పార్టీ

Maoists | మావోయిస్ట్​ పార్టీలో విభేదాలు.. అభయ్​ను ద్రోహిగా పేర్కొన్న పార్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maoists | మావోయిస్టు పార్టీలో (Maoist party) అంతర్గత విబేధాలు బయట పడ్డాయి. ఇటీవల తాము ఆయుధాలు వీడటానికి సిద్ధంగా ఉన్నామని అభయ్​ పేరిట లేఖ బయటకు రావడంతో పార్టీలో లుకలుకలు ఉన్నట్లు స్పష్టం అయింది.

ఆపరేషన్​ కగార్(Operation Kagar)​ ఆపేస్తే.. తాము ఆయుధాలు వీడి లొంగిపోతామని ఇటీవల అభయ్​ పేరిట లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిని ఇప్పటికే మావోయిస్టులు ఖండించారు. ఆ ప్రకటన అభయ్ వ్యక్తిగతంగా పేర్కొన్నట్లు చెప్పారు. తాము శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఆయుధాలు వీడుతామనే ప్రకటన మాత్రం చేయలేదన్నారు.

- Advertisement -

Maoists | ఆయుధాలు అప్పగించాలి

మల్లోజుల వేణుగోపాల్​ అలియాస్​ అభయ్​ (Mallojula Venugopal alias Abhay) లేఖతో కేంద్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అభయ్​ పేరిట కేంద్రంతో శాంతి చర్చలకు పిలుపునిచ్చిన ఆయనను పార్టీ ద్రోహిగా పేర్కొంది. ఆయన వద్ద ఉన్న ఆయుధాలు వెంటనే అప్పగించాలని ఆదేశించింది. లేకపోతే పీపుల్స్​ గెరిల్లా ఆర్మీ (People’s Guerrilla Army) ఆయుధాలను స్వాధీనం చేసుకుంటుందని చెప్పింది. ఓ వైపు ఆపరేషన్​ కగార్​, మరోవైపు లొంగుబాటులతో ఇబ్బందులు పడుతున్న నక్సల్స్​కు ఇప్పుడు అంతర్గత కలహాలు తోడయ్యాయి. విబేధాలతో ఉద్యమం మరింత నీరు గారే అవకాశం ఉందని పలువురు అనుకుంటున్నారు.

Maoists | ఆయన తమ్ముడే..

మల్లొజుల వేణుగోపాల్​ మావోయిస్టు కీలక నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్​ కిషన్​జీ తమ్ముడు. కిషన్​జీ 2011లో బెంగాల్​ (Bengal)లో జరిగిన ఎన్​కౌంటర్​లో చనిపోయారు. కిషన్​ జీ భార్య గద్వాలకు చెందిన సుజాతక్క అలియాస్‌ పోతుల కల్పన ఇటీవల తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎన్నో కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమె అనారోగ్య కారణాలతో డీజీపీ ఎదుట సరెండర్​ అయ్యారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News