Dharani Scam | ధరణి, భూ భారతి స్కామ్​.. 15 మంది నిందితుల అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dharani Scam | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ధరణి, భూ భారతి పోర్టల్​ స్కామ్​లో (Bhu Bharati portal scam) పోలీసులు 15 మందిని అరెస్ట్​ చేశారు. ఈ మేరకు వరంగల్​ సీపీ సన్​ ప్రీత్​సింగ్​ (Warangal CP Sunpreet Singh) శుక్రవారం వివరాలు వెల్లడించారు. భూముల రిజిస్ట్రేషన్ల కోసం బీఆర్​ఎస్​ హయాంలో ధరణి పోర్టల్​ (Dharani portal) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక దీనిని భూ భారతిగా మార్చారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dharani Scam | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ధరణి, భూ భారతి పోర్టల్​ స్కామ్​లో (Bhu Bharati portal scam) పోలీసులు 15 మందిని అరెస్ట్​ చేశారు. ఈ మేరకు వరంగల్​ సీపీ సన్​ ప్రీత్​సింగ్​ (Warangal CP Sunpreet Singh) శుక్రవారం వివరాలు వెల్లడించారు.

భూముల రిజిస్ట్రేషన్ల కోసం బీఆర్​ఎస్​ హయాంలో ధరణి పోర్టల్​ (Dharani portal) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక దీనిని భూ భారతిగా మార్చారు. కొంతమంది ముఠాగా ఏర్పడి అధునిక సాంకేతికతతో ధరణి, భూ భారతి పోర్టల్​లో మోసాలకు పాల్పడ్డారు. రిజిస్ట్రేషన్​ కోసం స్లాట్ బుక్​ చేసుకునే సమయంలో అసలు ఫీజు కంటే తక్కువ చెల్లించేవారు. అనంతరం రిసిప్ట్​ను ఎడిట్ చేసి పూర్తి ఫీజు చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించేవారు. యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri district) కేంద్రంగా ఈ ముఠా మోసాలకు పాల్పడింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. ఇటీవల ఈ వ్యవహారం బయటపడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Dharani Scam | పరారీలో 9 మంది

ఈ కేసులో 15 మంది నిందితులను అరెస్ట్​ చేసినట్లు సీపీ తెలిపారు. మరో 9 మంది పరారీలో ఉన్నారని చెప్పారు. భువనగిరి జిల్లాకు చెందిన ఆన్‌లైన్ సర్వీస్ నిర్వాహకులు పసునూరి బసవరాజు, జెల్ల పాండులను ప్రధాన నిందితులుగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో గతంలో అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. యాదగిరిగుట్టలోని ఆన్​లైన్​ సెంటర్ల ద్వారా మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. దీంతో రూ.3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది.

Dharani Scam |  రూ.63 లక్షలు స్వాధీనం

రెండు జిల్లాల్లో కలిపి నిందితులు 1,080 రిజిస్ట్రేషన్లలో మోసాలకు పాల్పడ్డారు. వీరు సొంతంగా స్లాట్​ బుక్​ చేయడంతో పాటు ఇతర ఆన్​లైన్​ సెంటర్ల నిర్వాహకులకు సైతం 10 నుంచి 30 శాతం కమీషన్ ఇస్తూ స్లాట్ బుకింగ్‌లు చేయించేవారు. దీనిపై జనగామలో 7, భువనగిరి జిల్లాలో 15 కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తాజాగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని, రూ.63.19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.కోటి విలువైన ఆస్తుల పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు డెస్క్‌టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లు సీజ్​ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...