అక్షరటుడే, వెబ్డెస్క్: DGCA imposed IndiGo Airlines | 2025 డిసెంబరులో విమాన సర్వీసుల రద్దు, జాప్యం వల్ల ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో ఎయిర్ లైన్స్పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ చర్యలు చేపట్టింది. ఈ ఇండిగోకు పెద్ద ఎత్తున జరిమానా విధించింది. గత నెల విమాన సర్వీసుల అంతరాయంపై దర్యాప్తు చేపట్టిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ Directorate General of Civil Aviation (DGCA).. తాజాగా ఇండిగో సంస్థకు రూ. 22.20 కోట్ల జరిమానా విధించింది. దీనికితోడు సంస్థ సీనియర్ మేనేజ్మెంట్పై కఠినమైన చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది.
DGCA imposed IndiGo Airlines | మూడు రోజుల్లోనే..
గతేడాది (డిసెంబర్ 3 – 5వ తేదీల మధ్య) ఇండిగో విమాన సర్వీసులు అస్తవ్యస్తమయ్యాయి. ఆ మూడు రోజుల్లో సుమారు 2,507 విమానాలు రద్దయ్యాయి. దీనితోడు 1,852 విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. దీనివల్ల ఆయా విమానాశ్రయాల్లో దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఈ క్రమంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ Union Ministry of Civil Aviation ఆదేశాలతో విచారణ నిమిత్తం డీజీసీఏ నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది. దర్యాప్తులో ఇండిగో వైఫల్యాలు వెల్లడయ్యాయి. సామర్థ్యానికి మించి సర్వీసు ప్రణాళికలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తినట్లు విచారణలో వెల్లడైంది. రెగ్యులేటరీ నిబంధనలను కూడా తుంగలో తొక్కినట్లు నిర్ధారించారు. విమానయాన సాఫ్ట్వేర్ సిస్టమ్లు కూడా బలహీనంగా ఉన్నాయని తేలింది. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో విఫలం కావడాన్ని కూడా గుర్తించారు.
