Bheemeswara Temple | భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు..

అక్షరటుడే, లింగంపేట : Bheemeswara Temple | మాఘ అమావాస్య (Magha Amavasya) పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. తాడ్వాయి మండలం సంతాయిపేట అటవీ ప్రాంతంలోని భీమేశ్వర ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కామారెడ్డి జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన భీమేశ్వర ఆలయానికి (Bheemeswara Temple) మాఘ అమావాస్య సందర్భంగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఉంచుకొని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు (Yellareddy DSP Srinivas Rao) , తాడ్వాయి ఎస్సై నరేష్ ప్రత్యేక ఏర్పాట్లు […]

అక్షరటుడే, లింగంపేట : Bheemeswara Temple | మాఘ అమావాస్య (Magha Amavasya) పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. తాడ్వాయి మండలం సంతాయిపేట అటవీ ప్రాంతంలోని భీమేశ్వర ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కామారెడ్డి జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన భీమేశ్వర ఆలయానికి (Bheemeswara Temple) మాఘ అమావాస్య సందర్భంగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఉంచుకొని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు (Yellareddy DSP Srinivas Rao) , తాడ్వాయి ఎస్సై నరేష్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Bheemeswara Temple | పవిత్ర స్నానాలు

భీమేశ్వర వాగులో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ముందస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. భీమేశ్వర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పార్కింగ్ ఇబ్బంది రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

భీమేశ్వర జాతరను పురస్కరించుకొని కామారెడ్డి ఆర్టీసీ (Kamareddy RTC) ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. స్పెషల్ బస్సులను ఆలయం వరకు నడిపిస్తున్నారు. కామారెడ్డి నుంచి తాడ్వాయి మీదుగా సంతాయి పేట్ భీమేశ్వర ఆలయానికి బస్ సర్వీసులను ఏర్పాటు చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...