MLA Madan Mohan | కాంగ్రెస్ పార్టీతోనే ఎల్లారెడ్డి అభివృద్ధి: ఎమ్మెల్యే మదన్ మోహన్

అక్షరటుడే, ఎల్లారెడ్డి: MLA Madan Mohan | కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి బాటలో సాగుతోందని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని 2, 4, 12 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయా వార్డుల సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) తదితర అభివృద్ధి పనుల పురోగతిని […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: MLA Madan Mohan | కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి బాటలో సాగుతోందని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని 2, 4, 12 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయా వార్డుల సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) తదితర అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.

MLA Madan Mohan | సమస్యల పరిష్కారానికి కృషి..

వార్డు ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ప్రస్తావించిన చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే అధికారులు నోట్ చేసుకునేలా ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ.. గత 30ఏళ్లలో తమ వార్డులో ఈ స్థాయిలో అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్​లో ఉన్న పనులను మున్సిపల్​ ఏఈ ద్వారా నమోదు చేసుకున్నామని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ వార్డు అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MLA Madan Mohan | రూ.22 కోట్లతో నాగిరెడ్డిపేట్ మండలం అభివృద్ధి

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో(Yellareddy constituency) రూ.22 కోట్లతో నాగిరెడ్డిపేట్ మండలం అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ​ అన్నారు. నియోజకవర్గంలో మూడు క్రీడా మైదానాలు సైతం నిర్మిస్తున్నట్లు తెలిపారు. నాగిరెడ్డిపేట మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. క్రీడలతో స్నేహభావం పెరుగుతుందన్నారు.

మండలం అభివృద్ధి కోసం రూ.22.77 కోట్ల నిధులను వెచ్చించినట్లు తెలిపారు. పోచారం ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ.3.16 కోట్లతో గోదాముల నిర్మాణం, రూ.73 లక్షలతో త్రిలింగేశ్వర ఆలయం అభివృద్ధి, రూ.2కోట్లతో నిజాంసాగర్​ ముందపు ప్రాంతాల్లో చెట్ల తొలగింపు పనులను చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పోచారం ప్రాజెక్ట్​, నాగిరెడ్డిపేట మండలం వెనుకబడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, రామచందర్ రెడ్డి, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...