MP Arvind | జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఎందరున్నా అభివృద్ధి సున్నా: ఎంపీ అర్వింద్​

అక్షరటుడే, ఇందూరు : MP Arvind | జిల్లాలో ఎందరో కాంగ్రెస్ నేతలు ఉన్నా.. అభివృద్ధి మాత్రం శూన్యమేనని ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కబ్జా కేసులను ఆపుతుందన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. రేవంత్ సర్కారు (Revanth Government) ఒక చెత్త కాగితం అని విమర్శించారు. యూజీడీ […]

అక్షరటుడే, ఇందూరు : MP Arvind | జిల్లాలో ఎందరో కాంగ్రెస్ నేతలు ఉన్నా.. అభివృద్ధి మాత్రం శూన్యమేనని ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కబ్జా కేసులను ఆపుతుందన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. రేవంత్ సర్కారు (Revanth Government) ఒక చెత్త కాగితం అని విమర్శించారు. యూజీడీ పనుల్లో ఎటువంటి పురోగతి లేదని, ప్రతి దీక్ష సమావేశాల్లో చెప్పినా లాభం లేకుండా పోతుందన్నారు. జిల్లా కలెక్టర్ (District Collector) హామీ ప్రకారం వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.

MP Arvind | ఎంఐఎం చేసింది ఏమీ లేదు..

రాష్ట్రంలో ఎంఐఎం ముస్లింలకు చేసింది శూన్యమని ఎంపీ అర్వింద్​ అన్నారు. మైనార్టీలు వాస్తవాలను గ్రహించి కాంగ్రెస్, బీఆర్​ఎస్​లకు​ కాకుండా పనిచేసే వాళ్లకు అవినీతి రహిత పాలన అందించే వారికి ఓటేయాలన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ (Congress) ముస్లింలకు ఏం చేసిందో ప్రశ్నించాలని సూచించారు.

MP Arvind | నిజామాబాద్​ జిల్లా పేరు ఇందూరుగా..

నిజామాబాద్​ను (Nizamabad) ఇందూరుగా మార్చే పని నగర ప్రజల చేతుల్లో ఉందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వారు నూటికి నూరుశాతం మార్చనున్నారని పేర్కొన్నారు. అర్బన్​లో ఎంఐఎం బీజేపీ (BJP) మాత్రమే గెలుస్తాయని కాంగ్రెస్ రెండు డివిజన్లలో కూడా గెలిచే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్​కు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని ఆరోపించారు. తాము మైనారిటీలకు కూడా సీట్లు ఇస్తామని, ముందుకు రావాలన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari), రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...