PCC Chief Mahesh Goud | ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. హామీలు అమలు చేస్తున్నాం : పీసీసీ చీఫ్​ మహేష్​ గౌడ్​

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : PCC Chief Mahesh Goud | ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ (Congress party) లక్ష్యమని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ మంది విజయం సాధించారని […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : PCC Chief Mahesh Goud | ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ (Congress party) లక్ష్యమని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ మంది విజయం సాధించారని పేర్కొన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో (municipal elections) విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయం స్పీకర్ పరిధిలో ఉందన్నారు.

మీడియా సమావేశంలో సహకార కార్పొరేషన్​ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...