Homeతాజావార్తలుACB Case | ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్

ACB Case | ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్

చండూరు డిప్యూటీ తహసీల్దార్​ ఏసీబీకి చిక్కాడు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు ఇవ్వడానికి ఆయన లంచం అడిగాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | లంచం తీసుకుంటూ ఓ డిప్యూటీ తహశీల్దార్​ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా (Nalgonda District) చండూరులో చోటు చేసుకుంది.

చండూరు డిప్యూటీ తహసీల్దార్​ (Chandur Deputy Tahsildar)గా చంద్రశేఖర్ పని చేస్తున్నాడు. గట్టుపల్ మండలం (Gattupal Mandal) తెరెడ్డిపల్లికి చెందిన ఒక అక్రమ రిజిస్ట్రేషన్​పై వివరాలు ఇవ్వాలని ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. ఆ వివరాలు ఇవ్వడానికి డిప్యూటీ తహశీల్దార్​ రూ.15 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు డిటీ చంద్రశేఖర్​ను హైదరాబాద్ బాలాపూర్ (Hyderabad Balapur)​లోని తన నివాసంలో రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ACB Case | ప్రతి పనికి రేటు

అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రతి పనికి రేటు కడుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే అది లేదు.. ఇది లేదని చెప్పి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ముఖ్యంగా తహశీల్దార్​ కార్యాలయాల్లో అవినీతి రాజ్యం ఏలుతోంది. భూములకు సంబంధించి ప్రతి లావాదేవికి కొందరు డబ్బులు తీసుకుంటున్నారు. స.హ. చట్టం కింద వివరాలు ఇవ్వడానికి కూడా లంచం అడగడం తీవ్ర చర్చనీయాంశం అయింది.

ACB Case | లంచం ఇవ్వొద్దు

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.

Must Read
Related News